ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగరును కృష్ణా బోర్డుకు అప్పగించడం కోసం జనవరి 17 తారీకు కేంద్ర జల్ శక్తీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నత అధికారులు ఒప్పుకున్న విషయం విదితమే, ఆ అంశం పై ఈ నెల 17 తారీఖు జరగాల్సిన సమావేశం తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ప్రకటించారు.vరెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయం మేరకు సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించేది చెబుతామని తెలిపారు.
ప్రస్తుతం ఈ విషయం పై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరిగాయి . దానికి గల కారణం 2023 లో ఆంధ్ర ప్రభుత్వం తమకు దక్కాల్సిన వాటాను పోలీసులను పెట్టి గేట్లు ద్వారా రాయలసీమ ఎత్తిపోతుల పథకం కోసం నీళ్లు తీసుకున్నారు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసారు.
నిజానికి ఆంధ్రా తెలంగాణ వాట ఏమి తీసుకోలేదు . ఆంధ్రాకు దక్కాల్సిన వాటాను మాత్రమే సాధించుకొంది ఆంధ్ర ప్రభుత్వం. గత నెలలో ఈ రెండు ప్రాజెక్టులు నిర్వహణ కృష్ణా బోర్డు కి అప్పగించాటానికి తెలంగాణా సమ్మతి తెలిపింది. . అదే తెలంగాణా ప్రభుత్వం అసెంబ్లీలో నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించం అని తీర్మానం చేసింది. గత నెలలో ఒప్పుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఇలా అసెంబ్లీలో ఇలా తీర్మాణం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.