చిన్నప్పుడే నక్సలైట్స్ లో కలవాలి అనుకున్న, చేగువేరా నాకు ఆదర్శం.. మావోయిస్టు లు అంటే నాకిష్టం.. గద్దర్ పాటలు వింటూ పెరిగా.. సమాజం మీద నాకు ఇష్టం ఎక్కువ.. ఎన్నోసార్లు అడవులలోకి వెళ్లి తుపాకీ పట్టుకుందాం అనుకున్న అంటూ తనో అరివీర భయంకర లెఫ్టిస్టు అని ఎప్పటికప్పుడు బిల్డప్ ఇచ్చే, కమ్యూనిస్ట్ లతో కూడా పొత్తుకున్న చరిత్ర ఉన్న పవన్ యొక్క వాస్తవ స్వరూపం దానికి పూర్తిగా విరుద్ధం. తనకు నక్సలైట్ భావజాలం మీద గానీ, లెఫ్టిస్ట్ ఐడియాలజీ పై గానీ ఎటువంటి అవగాహన లేదని ఎప్పటికప్పుడు తేటతెల్లం అవుతూనే ఉంటుంది.. తాజాగా మావోయిస్టు నేత గణేష్ యొక్క బహిరంగ్ లేఖ దాన్ని మరోసారి నిరూపించింది..
వివరాల్లోకి వెళ్తే, దేశ రాజకీయాలపై మావోయిస్టుల తరపున బహిరంగ లేఖ రాస్తూ మావోయిస్ట్ నేత అయిన గణేష్ పవన్ వైఖరిపై విమర్శలు గుప్పించారు.. పవన్ కు విశ్వసనీయత తక్కువ అనీ, అతనికి స్థిరమైన రాజకీయ విధానం లేదని, పార్టీ స్థాపించినపుడు తనది కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనీ ఇప్పుడు బిజెపి తో పొత్తు పెట్టుకున్నాడు అనీ, సినీ గ్లామర్ కు రాజకీయాలు సరిపోలవని, రాజకీయ నిరుద్యోగులకు జనసేన అడ్డాగా మారింది అని ఘాటుగా విమర్శించారు.. ఈ లేఖ వలన పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని నగ్నంగా ప్రజల ముందు పెట్టినట్లు అయ్యింది. తనకంటూ ఏ ప్రత్యేక అజెండా, సిద్ధాంతం లేకుండా కేవలం బాబు ప్రయోజనాల కోసమే పని చేసే పవన్ కల్యాణ్, మొదటి నుండి నక్సలైట్ భావజాలం ఉన్న వాణ్ణి అంటూ తనకు తాను హైప్ ఇచ్చుకునే వాడు, తీరా చూస్తే ఆచరణలో మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం… అందుకే కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వకుండానే మావోయిస్తూల చేత ఛీ కొట్టించుకున్నాడు..
మరో వైపు, ఎన్నికలన్నా, ఎన్నికల ప్రక్రియ అన్న, ప్రజాస్వామ్యం అన్నా ఏహ్యభావం ఉండే మావోయిస్టులు, వారు పుట్టిన నాటి నుండీ అన్ని ప్రభుత్వాలపై విమర్శలు చేయడం పరిపాటే. బీజేపీ, కాంగ్రెస్ ఆఖరికి పశ్చిమ బెంగాల్ లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాలపై, కొన్ని సార్లు కేరళ లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం పై కూడా మావోయిస్టు లు విమర్శ చేయడం అందరికీ తెల్సిన విషయమే. కానీ 2019 నుండి నేటి వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై ఒక్కటంటే ఒక్క అలిగేషన్ గానీ, విమర్శ గానీ జగన్ ప్రభుత్వం పై మావోయిస్టులు చేసిన దాఖలాలు లేవు, కనీసం ఈ ఐదేళ్లలో ఒక్క ఎంకౌంటర్ లేదు, పోలీస్ లపై వారి దాడి కూడా లేదు. స్థూలంగా చెప్పాలి అంటే ఈ ఐదేళ్లలో మావోయిస్టుల మూమెంట్ ఏపీ లో లేదు. శ్రీకాకుళం, విశాఖ మన్యం లో గిరిజనుల స్థితిగతులు మార్చిన తీరుపై, బడులు తీర్చిదిద్దిన విధానంపై వారి ప్రశంశలు కూడా దక్కాయి… దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు జగన్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పని చేస్తుందో, మావోయిస్టుల కల అయిన పేద, గిరిజన, బహుజన సంక్షేమం పై ఈ ప్రభుత్వ శ్రద్ధ ఏపాటిదో…