కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు లేఖలు రాయడం ఆపలేదు. పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకోవాలి, సీఎం పదవి షేరింగ్ అడగాలని ఇప్పటికే చాలాసార్లు సూచించారు. ఆయన లేఖలు సేనానికి నచ్చడం లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్ని సీట్లు ఇస్తారో తేల్చలేదు. కానీ జోగయ్య మాత్రం ఎక్కడెక్కడ సేన అభ్యర్థులుండాలో తేల్చి చెప్పారు. 2019లో లానే పవన్ ఈసారి కూడా రెండు చోట్ల పోటీ చేయాలని సూచించారు. మొత్తం 41 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ సీట్లు తీసుకోవాలని చెప్పారు. నాగబాబును అసెంబ్లీ, లేదా పార్లమెంట్కు పోటీ చేయించాలన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం నుంచి పవన్ కల్యాణ్, భీమవరం నుంచే ఆయనే, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, నిడదవోలు చేగొండి సూర్యప్రకాశ్, ఉంగుటూరు పుప్పాల శ్రీనివాస్, ఏలూరు రెడ్డి అప్పలనాయుడు (తూర్పు కాపు) లేదా నారా శేషు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, కాకినాడ సిటీ చిక్కాల దొరబాబు, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజమండ్రి రూరల్ కె.దుర్గేష్, రాజానగరం బత్తుల బాలకృష్ణ, కొత్తపేట బండారు శ్రీనివాస్, రామచంద్రాపురం పోలిశెట్టి చంద్రశేఖర్, ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి పంచకర్ల రమేష్, యలమంచిలి సుందరపు విజయకుమార్, చోడవరం శివశంకర్, గాజువాక సుందరపు సతీష్, భీమిలీ పంచకర్ల సందీప్, విశాఖ ఉత్తరం పసుపులేటి ఉషాకిరణ్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బండ్రెడ్డి రామకృష్ణ లేదా బచ్చు వెంకటనాథ్ ప్రసాద్, పెడన బూరగడ్డ వేదవ్యాస్ లేదా పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), నూజివీడు బర్మా ఫణిబాబు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు పడమర తలసి రామచరణ్, దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఆమంచి స్వాములు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి మువ్వల రవీంద్ర, రాయలసీమ జిల్లాలకు సంబంధించి మదనపల్లి శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు ఆదికేశవులు నాయుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి, తిరుపతి కొణిదెల నాగబాబు, నంద్యాల శెట్టి విజయకుమార్, గుంతకల్లు మణికంఠ, రాజంపేట ఎమ్వీ రావు, అనంతపురం టీసీ వరుణ్, పుట్టపర్తి శివశంకర్ (బ్లూమూన్ విద్యాసంస్థలు), తంబళ్లపల్లి కొండా నరేంద్ర, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి ఎడ్చెర్ల పోగిరి సురేష్ బాబు (తూర్పు కాపు), నెల్లిమర్ల లోకం మాధవి (తూర్పు కాపు), విజయనగరం గుర్రాల అయ్యలు (తూర్పు కాపు) లేదా పొలవలస యశ్వసిని (తూర్పు కాపు), గజపతినగరం పడాల అరుణ (తూర్పు కాపు), ఇక పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి నర్సాపురం మల్లినీడు తిరుమలరావు (బాబీ), కాకినాడ సానా సతీష్, మచిలీపట్నం బాలశౌరి, అనకాపల్లి నుంచి కొణిదెల నాగబాబు లేదా బొలిశెట్టి సత్యనారాయణ, రాజంపేట ఎంవీ రావు, విజయనగరం నుంచి గేదెల శ్రీనివాస్ (తూర్పు కాపు)ను బరిలోకి దించాలన్నారు.
ఆర్థికంగా బలవంతులైన కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు కులస్తులకు సీట్లను దక్కించుకోవాలని జోగయ్య తన లేఖలో పవన్ కల్యాణ్ను కోరారు. కాగా ఈ లేఖలు తెలుగుదేశం నేతలకు తలనొప్పిగా మారాయి. ఉభయగోదావరి జిల్లాల్లోనే సేనను ఏడెనిమిది సీట్లకు పరిమితం చేయాలని చూస్తుంటే అధికంగా అడుగు అని సేనానికి జోగయ్య చెప్పడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు జనసైనికులు సోషల్ మీడియాలో ఈ లేఖలు పెట్టి ఇవన్నీ అడగాలని పవన్ను కోరుతున్నారు. పైసీట్లలో ఇప్పటికే ఆంధ్రజ్యోతి చాలా వాటిని తెలుగుదేశం అభ్యర్థులకు కేటాయిస్తూ వార్తలు ప్రచురించింది. బాబుకేమో బీజేపీ ఇంకా గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారింది.
జోగయ్యకు బాగా అలుసైపోయానని అందుకే సీట్లు ఎక్కడ తీసుకోవాలో లేఖలు రాస్తున్నాడని పవన్ ఆగ్రహంతో ఉన్నాడని తెలిసింది. అసలు ఆయనకు తన రాజకీయ జీవితంతో ఏ పనంటూ సన్నిహితుల వద్ద వాపోయారని సమాచారం. చంద్రబాబు, లోకేశ్ కూడా జోగయ్యపై ఫైరయ్యారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. జనసేనను అంతం చేయాలని చూస్తుంటే కాపు సంక్షేమ సేన పేరుతో పవన్ అభిమానులను రెచ్చగొట్టి తమపైకి ఉసిగొల్పుతున్నాడని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల తేదీ వచ్చే లోపు ఈ అయిష్ట పొత్తులో ఇంకెన్ని చిత్రవిచిత్రాలు చూడాలో..