2019లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన మహిళా నేత మాకినీడు శేష కుమారి నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకోనున్నారు. శేష కుమారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 28 వేల ఓట్లు సంపాదించారు. 2014 నుంచి 2024 వరకు పార్టీని పటిష్ట స్థానానికి తీసుకొని వెళ్లారు. పార్టీ తలపెట్టిన అన్ని కార్యక్రమాలు చురుగ్గా నియోజకవర్గ స్థాయిలో జరిగేటట్లు చేశారు. 10 సంవత్సరాలు పాటు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు.
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తరుణంలో ఇప్పటి వరకు శేష కుమారికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు జనసేన అధిష్టానం. పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత పిఠాపురంలో నియోజవర్గ స్థాయి నేతలతో జరిగిన సమావేశంకి కూడా శేష కుమారికి ఆహ్వానం పంపలేదు. మహిళా నేతను కాబట్టే తనకు సరైన గౌరవం దక్క లేదు అని తన సన్నిహితులతో వాపోయారు.గౌరవం లేని చోట తాను ఉండలేను అంటూ కూడా తన అనుచర వర్గంతో వెల్లడించారు.శేష కుమారి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం జనసేన పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సిపిలో జాయిన్ కానున్నారని సమాచారం.
శేష కుమారితో పాటు నియోజవర్గంలోని జనసేన కీలక నేతలు, కార్యకర్తలు పిఠాపురం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, కాపు సంక్షేమ నాయకులు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ చేరికలు జరగనున్నాయి.