సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకోని ఆలాగే అ కూటమి లోకి బిజెపినీ తీసుకువచ్చి గుంపులుగా జత కట్టారు. మొదట గౌరవప్రద సీట్లు, అధికారం లో వాటా అంటూ మొదలుపెట్టి 50-60 సీట్లకు తగ్గకుండా అని చెప్పి 24 సీట్లకు ఒప్పుకోని చివరకు 21 సీట్లు తీసుకున్నారు. సరే అ 21 సీట్లలో అయిన పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశారా అని చూస్తే వైసీపీ నుండి నేతలను దిగుమతి చేసుకొని వారికి టికెట్ లు కేటయియంచారు. అది ఒక రకంగా పర్వాలేదు మరి దారుణంగా కూటమిలో వున్న టీడీపీ నాయకులను తన పార్టీ జన సేన లోకి తీసుకొని వారికి సీట్లు కేటాయించడం అనేది పవన్ కళ్యాణ్ దౌర్భాగ్య స్థితినీ తెలియచేస్తుంది.
భీమవరం లో టీడీపీ ఇంచార్జీ అయిన పులపర్తి ఆంజనేయులను తన పార్టీలోకి జాయిన్ చేసుకొని భీమవరం టికెట్ కేటాయించారు. అంతటి తో ఆగకుండా ఇప్పుడు కొత్తగా అవనిగడ్డ లో టీడీపీ ఇంచార్జీ మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ను జన సేన లోకి తీసుకొని అవనిగడ్డ టికెట్ కేటాయించబోతున్నారు . అలాగే పాలకొండ నియోజకవర్గం లో టీడీపీ ఇంచార్జీ నిమ్మక జయకృష్ణను జన సేన లోకి తీసుకొని పాలకొండ టికెట్ ఇవ్వబోతున్నారు.
ఈ మాత్రం దానికి జన సేన పార్టీ దేనికి , పొత్తు దేనికి. జన సేన పార్టీనీ టీడీపీలోకి విలీనం చేసి టీడీపీ గుర్తు మీదనే అందరు పోటీ చేసి వుంటే బాగుండేది అని జన సేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ నిర్ణయలపైన ఛీదరించుకుంటున్నరు. ఆసలు అభ్యర్థులు, బలం లేని చోట సీట్లు తీసుకోవడం దేనికి వాటిని తిరిగి టీడీపీ నాయకులకు ఇవ్వడం దేనికి అంటూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. జన సేన బలంగా వున్న చోట, నాయకులు వున్న చోట పార్టీ సీట్లు తీసికొని వుంటే బాగుండేది ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు ఏమని అడగాలి , కార్యకర్తలకు ఏమని సర్ధిచెప్పాలో తెలియడం లేదు అంటూ వాపోతున్నారు. జన సేన అధినేత ఈ మాత్రం దానికి హడావిడి చెయ్యడం దేనికి టీడీపీలోకి విలీనం చేసి వుంటే ఓట్ల బదలాయింపు కూడా సక్రమంగా జరిగేది అని రాజకీయా పరిశీలకులు, మీడియా ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.