సినిమా ప్రపంచంలో ఉండగా నీతి, నిజాయితీ కబుర్లతో తన సినిమాలు నింపేసిన పవన్ కళ్యాణ్.. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టగానే ఆ నిజాయతీ , నిబద్దతా అంతా ఒట్టి బూటకం మాత్రమే అని తెలిసిపోయేలా అడుగులు వేస్తూ వచ్చారు. ప్రజారాజ్యంలో ఉండగా యువరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నో ఎన్నికల ప్రసంగాల్లో పాల్గోని చంద్రబాబుని తెలుగుదేశం విధానాలను విమర్శించిన ఆయన జనసేన ఆవిర్భావం నుంచే అదే చంద్రబాబుతో కలిసి బహిరంగంగా కొన్ని రోజులు, చీకట్లో మరికొన్ని రోజులు రాజకీయ ప్రయాణం సాగించడంతో పవన్ కళ్యాణ్ నిజాయతీ పరుడనే గాలి బుడగ పగిలిపోయింది.
జనసేన క్యాడర్ మొదటి నుండి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లాడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చినా, అలా వ్యతిరేకించిన వాళ్ళు వైసిపీ కోవర్టులని తీవ్రంగా సొంత క్యాడర్ పైనే నిందలు వేసిన పవన్ కళ్యాణ్ తీరు ఆ పార్టీ క్యాడర్నే అయోమయానికి గురిచేసింది. అయితే నిన్నటి రోజున బీసీ సభ పేరున చంద్రబాబు తనకి ప్రజలు అవకాశం ఇస్తే పలానా హామీలు నెరవేరుస్తానని చెప్పడం ఆ హామీలకు 2014 మాదిరే తనది పూచి అనట్టుగా పవన్ కళ్యాణ్ ఉండటం చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇంత పతనమైపోయాడా అని వారి క్యాడరే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇదే పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడి హోదాలో చంద్రబాబుకు తొమ్మిదేళ్ల పాలనలో గుర్తు రాని సంక్షేమ పథకాలు ఎన్నికల ముందు గుర్తుకు రావడం ప్రజలను మరోసారి మోసం చేసేందుకేనని విమర్శించారు. నగదు బదిలీ, కలర్ టీవీ పధకాలతో ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తాం అంటూ బూటకపు మాటలు చెబుతున్నారని, టీడీపీ హయాంలో అవినీతికి అడ్డు అదుపు లేదని తీవ్రంగా విమర్శించిన ఆయన ఇప్పుడు అదే టీడీపీ తో కలిసి ఎన్నికల హామీలు ఇవ్వడం చూస్తే రాజకీయంగా పవన్ కళ్యణ్ పతనం కళ్ళారా మనమే చూస్తున్నం అని తీవ్ర ఆవేదన చెందుతున్నారు జనసేన క్యాడర్.