జనసైనికులను చూసి మిగిలిన పార్టీల కార్యకర్తలు అయ్యో పాపమని జాలిపడుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. పవన్ పార్టీ పెట్టి సుమారు పది సంవత్సరాలైంది. అప్పటి నుంచి సీఎం.. సీఎం అని అరుస్తుంటే కనీసం ఎమ్మెల్యే కూడా రాలేకపోయాడు. 2019లో ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరిగింది. 24లో సీఎం అయిపోతాడని కలలు కన్నారు. కానీ చంద్రబాబు నాయుడితో పొత్తు పెట్టుకుని కేవలం 24 అసెంబ్లీ సీట్లకే పరిమితమయ్యాడు. పోటీ చేసే అసెంబ్లీ సీటుపై ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో జనసైనికుల్లో అసహనం పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో మిగితా పార్టీ కార్యకర్తల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు సమాధానాలు చెప్పలేక తప్పించుకుని తిరుగుతున్నారు.
తాజాగా పార్లమెంట్కు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో సేనాని అభిమానగణమే ఆయన్ను ఛీత్కరించుకునే పరిస్థితి వచ్చింది. కాపులైతే ఇతగాడు ఇక మారడంటూ దూరం జరిగారు. దీంతో కొందరు జనసైనికులు సోషల్ మీడియాలో కవర్ డ్రైవ్స్కు తెరతీశారు. ఎంపీ అయ్యి.. కేంద్ర మంత్రి అవుతాడని.. అప్పుడు దేశమంతా పవన్ పేరు మారుమోగుతుందని పోస్టులు పెడుతున్నారు. మరో దాంట్లో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘ఎంజీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి కాకముందు ఎంపీగా ఎన్నికయ్యారు. జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా సీఎం కాకముందు ఎంపీగా పనిచేశారు. శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సహా వివిధ రాజకీయ పదవులను నిర్వహించే ముందు ఎంపీగా ఎన్నికయ్యారు. హెచ్డీ దేవెగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎంపీగా పనిచేశారు. మరియు తర్వాత భారత ప్రధాని అయ్యారు. జయలలిత అనేకసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడానికి ముందు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వసుంధర రాజే రాజస్థాన్ సీఎం కాకముందు ఎంపీగా పనిచేశారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ లోడింగ్..’
అసలు పవన్ ఉద్ధేశాలే వేరు. చంద్రబాబును సీఎం చేయడమే ఆయన లక్ష్యం. పొత్తులో భాగంగా పవర్ షేరింగ్ కూడా లేదు. బేషరతుగా మద్దతు ఇచ్చారు. టీడీపీకి ఉన్నంత బలం మనకి లేదని ఇటీవల ఉమ్మడి సభలో చెప్పారు. దీంతో జనసైనికులు బాధలో ఉన్నారు. వారి నుంచి ఓట్లు ట్రాన్స్ఫర్ కావనే భయంతో హైప్ ఇచ్చేలా పోస్టులు పెడుతున్నారు. కానీ సేనానికి అంత సినిమా లేదనే విషయం అందరికీ తెలుసు. జగన్ కూడా సీఎం కాకముందు కడప ఎంపీ అయ్యారు. సొంత పార్టీ పెట్టారు. జనంలో తిరిగి చరిత్రలో కనీవినీఎరుగని రీతిలో విజయం సాధించారు. ఇందులో పావలా భాగం కష్టపడినా ఈపాటికి పవన్ ఎమ్మెల్యే అయ్యుండేవాడు. కానీ పదేళ్లలో అలాంటిదేమీ జరగలేదు. ఇన్నేళ్లయినా కనీసం పోటీ చేయడానికి నియోజకవర్గమంటూ లేదు. అసెంబ్లీనా.. పార్లమెంట్నా అనే క్లారిటీ లేదు. అందుకే సేనాని ఎటూ కాకుండా మిగిలిపోయాడు. చంద్రబాబు నీడనే ఉంటే ఎప్పటికీ ఎదగలేడు.