1994లో మద్య నిషేధం విధింపు, సడలింపు కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విచ్చలవిడిగా అక్రమ మద్యం వ్యాపారం సాగించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల లిస్ట్, వారిని చంద్రబాబు ఎలా కాపాడారు అన్న విషయం గత వీడియోలలో చూసి ఉన్నారు. ఆనాడు ఈ లిస్టు పత్రికలలో రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కాగా, మరుసటి రోజుల్లో జరిగిన అసెంబ్లీ సమావేశలని సైతం కుదిపేసింది ఆ వార్త .
టీడీపీ ఎమ్మెల్యేలతో కూడిన మద్యం మాఫియా పూర్తి సాక్ష్యధారాలతో దొరికిపోవడంతో ఈ అంశం పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలదీయగా విధిలేని పరిస్థితుల్లో ఆ జాబితా నిజమే అని తలొంచుకొని తన తమ్ముడు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారించిన విషయాన్ని ఒప్పుకొన్నారు చంద్రబాబు.
దీని పై అసెంబ్లీని స్థంభింపజేసిన కాంగ్రెస్ సభ్యులు ఆ జాబితా పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని డిమాండ్ చేయగా ఆ జాబితాతో నాకు సంభందం లేదు. చంద్రబాబుని అడగండి అని యనమల సమాధానమివ్వడంతో నివ్వెర పోవడం కాంగ్రెస్ శాసన సభ్యుల వంతు అయ్యింది.
అనంతరం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన చంద్రబాబు జాబితా నిజమే కానీ నా తప్పేం లేదంటూ కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తూ కర్ణాటక రాష్ట్రం లీటరు మద్యం 22 రూపాయలకు, మహారాష్ట్ర 18, మద్యప్రదేశ్ లో 19 రూపాయలుకు అమ్ముతుండగా తాను మాత్రం ప్రభుత్వానికి లాభం చేకూర్చడం కోసం అందరి కన్నా అత్యధికంగా లీటరు 42 రూపాయలకు అమ్ముతున్నానని మరో సమాచారం ఇచ్చారు .
అలా ఇతర రాష్ట్రాల కన్నా రెండింతలు ఎక్కువ ధరకి మద్యం అమ్మిన చంద్రబాబు, కల్తీ, అక్రమ, నకిలీ మద్యం, నాటు సారా ఏరులై పారించిన నాటి టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు నేడు సామాన్యడికి మద్యం అందుబాటులో లేకుండా చేసి మద్యపాన వ్యసనాన్ని తగ్గిస్తానని హామీ ఇచ్చి అందుకనుగుణంగా మద్యం దుకాణాల సంఖ్య తగ్గించి కేవలం ప్రభుత్వ పరంగానే అమ్ముతుంటే మద్యం మాఫియా అని, పేదలకు చౌక ధరలో మద్యం అందుబాటులో లేదని మొసలి కన్నీరు కార్వడం గమనార్హం.