బీజేపీ దెబ్బకి పదేళ్ల నుండి అధికారానికి దూరం అయ్యి ఇంకో పదేళ్ల తర్వాత కూడా కేంద్రం లో అధికారంలోకి వచ్చే సూచనలు లేక, తాను ప్రధాని కావాలన్న తన తల్లి సోనియా గాంధీ ఆశ నిరాశగానే మిగిలిపోతుందనే విషయాన్ని జీర్ణించుకోలేక, పాపం రాహుల్ గాంధీ పడని పాట్లు లేవు.. భారత్ జోడో యాత్రకేమో స్పందన కరువు, మొదటి విడత యాత్ర అయ్యాక జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఓటమి చెందింది.. ఇప్పుడు రెండో విడత మధ్యలో ఉండగానే ఇండియా అనే కూటమి నుండి చిన్నగా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. మొన్న మమతా, నిన్న నితీష్ ఇలా చివరికి ఆ కూటమిలో కాంగ్రెస్ తప్ప వేరే పార్టీనే ఉండేలా లేదు.. మరోపక్క బిజెపి ఇంకోసారి ఎవరి మద్దతు అవసరం లేకుండానే సింగిల్ గా మెజారిటీ పొందేలా ఉంది.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారం లో ఉన్న ఆ రెండంటే రెండు రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోయినా ఆశ్చర్యం లేదు..
ఇలాంటి జఠిలమైన సందర్భాల్లో రాహుల్ గాంధీకి పాత చింతకాయ పచ్చడి లా ఓ అనూహ్యమైన ఆలోచన రిజర్వేషన్ల రూపంలో తట్టినట్లుంది..
తాము అధికారం లోకి రాగానే రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగిస్తాం అని వాగ్దానం చేసేశాడు… గత ఐదేళ్లగా దేశంలో రిజర్వేషన్ల అనే కార్చిచ్చు చల్లారినట్లుగా కనపడుతుంది. ఈ మాట తర్వాత మళ్లీ ఆ చిచ్చు అంటుకుంటుందేమో చూడాలి..
అసలు 50% పరిమితి తొలగించడం సాధ్యమేనా? EWS రిజర్వేషన్ల పేరుతో కొత్తగా వచ్చిన 10% రిజర్వేషన్ల తర్వాత అది అసలు సాధ్యమేనా?
పార్లమెంట్ కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ అది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బ తీసేలా ఉండరాదని కేశవానంద భారతి కేస్ లో సుప్రీమ్ తీర్పు.. అందుకే అప్పటి నుండి రాజ్యాంగ సవరణలపై పూర్తి నియంత్రణ సుప్రీం కోర్ట్ కలిగి ఉందని చెప్పొచ్చు…
1960 లలో MR బాలాజీ Vs మైసూర్ రాష్ట్రం కేస్ లో మొదటి సారి సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50% దాటరాదని వెల్లడించింది.. దాని తర్వాత కూడా రాష్ట్రాలు అడపాదడపా కోరినవారికల్లా రాజకీయ లబ్ధికోసం రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోయారు, తర్వాత సుప్రీంకోర్టులో కొట్టివేయడమూ జరిగింది..
మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీ లకి రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ పై ఇందిరా సహానీ కేస్ లో సుప్రీం మళ్లీ ఒకసారి స్పష్టంగా రిజర్వేషన్లు 50% దాటరాదని పేర్కొంది. దాన్నే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ గా కూడా భావిస్తుంది.. తర్వాత చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని సుప్రీం కోర్ట్ గుర్తు చేస్తూ, రిజర్వేషన్ల పరిధి 50% ఎందుకు ఉండాలనే విషయంపై స్పష్టతని ఇచ్చింది.. 50% పరిధి దాటితే అసలు రిజర్వేషన్ల యొక్క అర్థమే మారిపోతుంది, రిజర్వేషన్లు పొందే వారి ప్రత్యేక రక్షణకి అర్ధం ఉండదు. అందరికీ రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతే వ్యవస్థలో కేవలం కులవారీ విభజన మాత్రమే ఉంటుంది అని చెప్తూ వస్తుంది…
EWS రిజర్వేషన్లు రాజ్యాంగం లో 103 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టినప్పుడు సుప్రీం కోర్ట్ లో జరిగిన వాదనల ప్రకారం అంతిమ తీర్పులో సమాజం లో అన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తి, పేదరికం మొదలగు వాటిని కులం కోణం లో చూడలేం కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన అప్పటికే రిజర్వేషన్లు ఉన్న వారికి మినహా మిగిలిన వారికి 10% రిజర్వేషన్లు ఇవ్వడం సబబే అని తీర్పునిచ్చింది… ఈ లెక్కతో సమాజం లో అన్ని వర్గాలకి రిజర్వేషన్లు ఉన్నట్టే… ఓపెన్ లో ఉన్న 40 శాతం లో అందరికీ అవకాశమిస్తూనే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారికి కి కూడా అవకాశం కల్పించినట్లయింది…
ఇప్పుడు కొత్తగా మళ్లీ 50% పరిమితిని ఎత్తేస్తా అనడం వల్ల, ఎవరికి లాభం? హర్యానా లో జాట్లు తమని ఎస్టీ లలో కలపమన్నారు… అక్కడ వారు రాజకీయం గా పలుకుబడి కలిగిన కులం వారే.. రేపు ఆ పరిమితి ఎత్తేస్తే జాట్లని ఎస్టీ లలో కలపాలని మల్లొకసారి ఉద్యమం వస్తే? వాళ్లని కలిపి ఎస్టీ రిజర్వేషన్ల ని కొత్తగా శృష్టిస్తే? ( హర్యానా లో అసలు ఎస్టీ జనాభా నే లేదు పంజాబ్ లో కూడా) నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ లే… ఇలాగే గుజరాత్ లో పటేళ్లు… కేరళలో నంబూద్రిలు, కర్ణాటక లో లింగాయత్ లు, ఆంధ్ర లో కాపులు… ఇలా ప్రతీ రాష్ట్రం లో మళ్లీ కుల ఉద్యమాలు, రిజర్వేషన్ల కొట్లాటలు మొదలవుతాయి… కానీ దాని వల్ల కాల్క్యూలేటర్ లు ముందు పెట్టుకుని లెక్కేసుకున్నా ఒక్కరికీ అదనపు ప్రయోజనం జరగదు. దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడటం తప్పా….
రాహుల్ గాంధీ ఇవన్నీ ఆలోచించే ఉంటాడా? అంత ఆలోచనా శక్తి ఆయనకుందా? ఉండి ఉంటే పదేళ్లు అధికారం లో ఉన్న పార్టీ మీద ఉండే ప్రభుత్వ వ్యతిరేఖ ఓటును కూడా తనవైపుకు తిప్పుకోలేకపోవడం ఏమిటి? 2009 నుండి 2014 మధ్య బీజేపీ ఇలాగే మబ్బు రాజకీయాలు చేసిందా?
కాంగ్రెస్ అండ్ రాహుల పరిస్థితి చూస్తుంటే అధికారం తీసుకొచ్చి మీరే ఇవ్వాలి అన్నట్లుగా ఉంది
1991- పీవీ నర్సింహారావు కాలం తర్వాత గత ముప్పై ఏళ్లలో ఒక్కరంటే ఒక్క నవతరం నాయకుణ్ణి తయారు చేసుకోలేకపోయిందికాంగ్రెస్, జగన్, పైలట్, సింధియా లాంటి వాళ్లు ఎదుగుతుంటే ఓర్వలేక తొక్కేసే ప్రయత్నాలు చేసి మా కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం అనుకుంది గానీ, కుర్చీ కిందకి నిప్పు అంటుకుందని ఎన్నడూ గ్రహించలేదు… దాని ప్రతిఫలమే… ఈ రోజు కాంగ్రెస్ లో తర్వాతి ముప్పై ఏళ్లకి దిశానిర్దేశం చేయడానికి, నాయకుడిలా నిలబడటానికి ఒక్కరూ లేరు… అందరూ ముసలి సంతానమే… పదేళ్ల తర్వాత చూసుకుంటే పాపం కాంగ్రెస్ లో యువ నాయకుల గురించి దేవుడెరుగు, మద్యవస్కుడైన నాయకులు కూడా లేరు..
అలాంటి గతి పట్టించారు 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కి…. కాంగ్రెస్ ముందు గాంధీల వలనుండి బయటికి రావాలి… తర్వాత రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టడం ఆపెయ్యాలి… అలా అయితేనే బతికే అవకాశం ఉంది.. లేదా బీజేపీ దెబ్బకి టెక్స్ట్ బుక్స్ లో కూడా కనపడదు….