ఒకసారి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాట్లాడుతూ, సౌత్ ఇండియా స్టూడెంట్స్ ఇంటర్వ్యూ లో రాముని తండ్రి ఎవరు అని అడిగితే దశరథుడు అని తెల్సి కూడా చెప్పడానికి ఆలోచించి అనుమానంగా దశరథుడు అని చెప్తారు, అదే ప్రశ్న ఓ నార్త్ ఇండియన్ స్టూడెంట్ ని ఇంటర్వ్యూ లో అడిగితే రావణుడు అని ఠక్కున చెప్పేస్తారు కాన్ఫిడెంట్ గా. ఇంటర్వ్యూయర్ ఆ కాన్ఫిడెంట్ గా తప్పు చెప్పిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు అంటాడు…
దీని అర్థం నీకు ఎంత మెమొరీ ఉందో వాళ్లకి అనవసరం, నీ ఆటిట్యూడ్ టువార్డ్స్ ది ప్రాబ్లమ్.. ముఖ్యం..
మన దేశంలో 6 వ తరగతి కుర్రోడు చెప్పే నోటి లెక్కలు కూడా యూఎస్ లో గ్రాడ్యుయేట్ కూడా చెప్పలేడు మనం అంత స్ట్రాంగ్ అని ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకున్న నిజం.. కానీ రియల్ టైం లో ఎందుకు మన విద్యార్థులు వెనకబడి పోతున్నారు?
మన విద్యావిధానం: లార్డ్ మెకాలే బ్రిటిష్ వారికి గుమస్తాలు గా సరిపోయేంత వరకే డిజైన్ చేసిన 1835 నాటి విధానం, ఇప్పటికీ చిన్న చిన్న మార్పులతో దాన్నే ఫాలో అవుతున్నాం. అందుకే మన చిన్నప్పటి నుండీ మన ఆలోచన అంతా, చదువయ్యాక ఉద్యోగం రావాలి అనే దగ్గరే ఆగిపోతుంది. సినిమాల్లో స్పీచ్ ల లా ఉందా?
సరే. ఈ ఉదాహరణ వినే ఉంటారే ? చేపపిల్లని చెట్లెక్కమంటే? చిరుతపులిని ఈత కొట్టమంటే? అవి ఎప్పటికీ తము అసమర్దులుగానే భావిస్తాయని?
కదా? కేవలం చదివింది గుర్తు పెట్టుకుని అది పరీక్ష సమయం లో యధాతదం గా ప్రింట్ చేసివ్వడమేగా ఇవాళ్టి మన ఎడ్యుకేషన్ సిస్టం లో ఎవరు టాలెంటెడ్? ఎవరు మొద్దు అని డిసైడ్ చేసేది?
చదివింది గుర్తు పెట్టుకోడమే మన చదువుల యొక్క లక్ష్యం..అదే మారాలి. గుర్తు పెట్టుకోడానికి హార్డ్ డిస్క్ లు, మైక్రో ఎస్డీ కార్డులు వచ్చేశాయ్.. ఇప్పుడు మన విద్యావిధానం లో అంతకు మించినది ప్రవేశపెట్టడమే కావాల్సింది..
IB: international baccalaureate అదే చేస్తుంది.. గుర్తు పెట్టుకోడం కాదు ఆలోచించడం నేర్పించడమే దీని ముఖ్య ఉద్దేశం..
ఏ మనిషైనా తన బాల్యం లో 14 ఏళ్ల వరకే కొత్తది నేర్చుకోగలిగే శక్తిని కలిగి ఉంటాడు తర్వాత అంతా అది తన బాల్యం వల్ల, పరిస్థితులకి తగ్గుట్టుగా వచ్చే రియాక్షన్స్ అని శాస్త్రీయంగా నిరూపించబడింది. విద్యా విధానం ఆ 14 ఏళ్ల బాల్యాన్ని ఇంతవరకే నేర్చుకోవాలనీ, ఇదే నేర్చుకోవాలని పరిమితం చేసేస్తుంది. ఒక్కో వ్యక్తిలో ఉండే వేర్వేరు కళలని, వేర్వేరు టాలెంట్స్ ని ఇది అసలు లెక్కలోకి కూడా వేసుకోదు..
దానికి భిన్నంగానే IB పని చేస్తుంది. వీరి కరికులం లో మనలాగే లాగ్వేజెస్, మ్యాథ్స్, సైన్స్, సోషల్(హిస్టరీ) కామన్ గానే ఉంటాయి కానీ వీటికి తోడు మరొక ముఖ్యమైన సబ్జెక్ట్: మిగతా వాటి నుండి దీనిని వేరు చేసేది “థియరీ ఆఫ్ నాలెడ్జ్”, ఇది మనకి కొత్త..దీనిలో క్రిటికల్ థింకింగ్, ఎథిక్స్ అనేది అత్యంత ముఖ్యమైనవి.
వీరి సిలబస్ లో ముఖ్యంగా రియల్టైమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద దృష్టి పెడతారు దానివల్ల బయటి ప్రపంచం లో సమస్యలని సులువుగా ఎలా ఎదుర్కోవాలనే విషయం మీద బాల్యం నుండే అవగాహన వస్తుంది. ఈ విధానం లో పరీక్షలున్నా మార్కుల గురించి, పాస్ అవ్వడం గురించి ఎలాంటి ఆందోళన ఉండదు. వారెం నేర్చుకోగలరో అదే నేర్పుతారు, నేర్చుకోలేని దానిని ఈజీగా ఎలా నేర్చుకోవాలో రియల్టైమ్ ఉదాహరణలతో నేర్పుతారు.
బట్టీ విధానం నుండి, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, ఎథిక్స్ వైపు మళ్లించడం IB ని తీసుకురావడం లో ముఖ్య ఉద్దేశం. ఎందుకనగా ప్రపంచ పోటీ లో మన విద్యార్థులు వెనకబడటానికి కారణం క్రిటికల్ థింకింగ్ లేకపోవడమే అనేది విద్యావేత్తలు ఒప్పుకునే అంశం.. ఇదే విషయాన్ని మొన్న ఇండియా టుడే ఇంటర్వ్యూ లో రాజ్దీప్ సర్దేశాయ్ తో సీఎం జగన్ చెప్పింది. యాదృశ్చికంగా రాజ్దీప్ సర్దేశాయ్ కూడా IB సిలబస్ లోనే చదివాడు…
కాకపోతే ఈ సిలబస్ చెప్పడానికి మన టీచర్లు సిద్దంగా ఉన్నారా? కెపాసిటీ బిల్డింగ్ చేయగలమా అని అందరి నుండి ఎదురవుతున్న ప్రశ్న..
మనందరం మర్చిపోయిన ఒక విషయం ఏమిటి అంటే, శ్రీ చైతన్య, నారాయణ స్కూల్స్ లో SSC,CBSE సిలబస్ చెప్తున్న టీచర్లు చాలా మందికి B.Ed కూడా లేదు.. చాలా మంది స్కూల్ లో సరిగా పెర్ఫార్మ్ కూడా చేసిన వారు కూడా కాదు( మీ చుట్టుపక్కలే వందల ఉదాహరణలు దొరుకుతాయి ఒకసారి వెతకండి). ఇక B.Ed చేసి అన్ని అర్హతలుండి కూడా వాటిలో చదువు చెప్తున్న వారు DSC రాసి విఫలమైన వాళ్లే అవ్వాలి కదా? ఈ లెక్కన వీళ్లతో పోలిస్తే B.ED చేసి, DSC రాసి క్వాలిఫై అయ్యి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన టీచర్లు వీరిపైనే పోటీగా పరీక్ష రాసి క్వాలిఫై అవ్వని వాళ్ళకంటే, అసలు వీళ్లు రాసిన పరీక్ష రాయడానికే అర్హత లేనివాళ్ళ కంటే ఎన్నో రెట్లు బెటర్ అనే కదా అర్థం?
కాకపోతే ప్రభుత్వ బడుల్లో చదువు చెప్పే టీచర్ లే, వాళ్లతో పాటు డీఎస్సి రాసి ఉత్తీర్ణత సాధించని వారు చదువు చెప్పే బడులకి పంపుతున్నారు కదా? అక్కడే మనం మోసపోయేది.. ప్రభుత్వ బడిలో సరిగా చదువు చెప్పకపోవడానికి కారణం కమిట్మెంట్ లేకవడమే కానీ వాళ్లకి రాక కానే కాదు.. వాళ్లు అన్ని రకాలుగా యోగ్యులే.. ప్రభుత్వాలు వాళ్లని అలా తయారు చేసాయి, భాద్యత తీసుకునేలా చేయలేదు, వాళ్లకి కావాల్సిన మౌలిక సదుపాయాలూ ప్రభుత్వాలు సమకూర్చలేదు. ప్రభుత్వ బడులు నిర్వీర్యం చేయడం మూలానా ఏపీ , తెలంగాణ లు ( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) అక్షరాస్యత లో వెనుకబడి ఉన్నాయిప్పుడు..
ఒక ఏడాది కాలం చాలదా వాళ్లని సరిగ్గా ట్రైన్ చేయడానికి? ఏడాదిలో వాళ్ల కెపాసిటీ బిల్డ్ చేయలేరా? IB ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసింది. అందుకే వాళ్ల ఆఫీస్ ని SCERT ఆఫీస్ పక్కనే పెడుతుంది. అక్కడి నుండే ఆపరేట్ చేయబోతున్నారు..
2035 నాటికి IB qualified సర్టిఫికేట్ తీసుకోబోతున్న మన తరువాతి తరాన్ని మనం చూడబోతున్నాం. ప్రపంచం లో టాప్ మోస్ట్ యూనివర్సిటీ లు మొదటి ప్రయారిటీ ఇచ్చేది IB విద్యార్థులకే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తో పాటు UK లోని టాప్ 20 విశ్వవిద్యాలయాలు, అమెరికా లోని టాప్ 10 విశ్వవిద్యాలయాలు IB స్టూడెంట్స్ తోనే నిండిపోయున్నాయని లెక్కలు చెప్తున్నాయి.. 2035 తర్వాత దేశం మొత్తం మన విద్యార్థుల ప్రతిభని చూస్తుంది. ప్రపంచ స్థాయి పోటీలో మన విద్యార్థులు నిలిచి చూపిస్తారు…