తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా భాగంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది ఐటీడీపీ. ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీల మీద ఏ రకమైన బురద వేయాలన్నా ఈ ఐ టి డి పి విభాగంలోనే తయారవుతుంది. అధికార పార్టీ నాయకులు పై అత్యంత జుగుప్సాకరంగా వ్యక్తిత్వహననం చేస్తూ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా దారుణమైన ట్రోల్స్ నారా లోకేష్ ఈ విభాగం ద్వారానే చేస్తాడు అనేది జగమెరిగిన సత్యం… ప్రస్తుతం ఆ విభాగానికి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన ఉద్యోగులు పరారీలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐటిడిపిలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు హైదరాబాద్ పారిపోయినట్టుగా తెలుస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ సీపీ విజయం ఖాయం అని వారికి ఇంటర్నల్ గా వచ్చిన సోర్స్ ద్వారా సమాచారం ఉండడంతో ఇంతకాలం అసత్య ప్రచారాలు తప్పుడు కథనాలతో అధికార పార్టీ నాయకుల పైన వారి కుటుంబ సభ్యులు పైన మహిళలు అని కూడా చూడకుండా అత్యంత దారుణమైన ట్రోల్స్ చేసి జీతానికి పని చేసిన ఐటీడీపీ ఉద్యోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం చట్టపరమైన శిక్షలకు సిద్ధమవడం తప్పదని తెలిసి ఆంధ్రా ని వదిలి హైదరాబాదులో తల దాచుకుంటున్నట్టుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మాటలతో చెప్పలేని విధంగా సామాజిక మాధ్యమాలలో అధికార పార్టీ నాయకులపై చేసిన తప్పుడు ప్రచారాలకు ఏపీలో ఉంటే తాట తీస్తారు అని భయపడి ఐటీడీపీ ఉద్యోగులు హైదరాబాద్ పారిపోయినట్టు చెబుతున్నారు రాజకీయ విమర్శకులు.