రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో ఏ ఏ కులాలలో ఎంతమంది జనాభా ఉన్నారనేది అధికారిక సమాచారం అందుబాటులో లేకపోయినా ఎన్నికల వేల ఆయా నియోజక వర్గాలలోని ప్రతి రాజకీయ పార్టీ వద్ద కాస్త అటూ ఇటుగా అంచనా ఉంటుంది. దాన్ని బట్టే ఆయా పార్టీల నాయకులు రాజకీయ వ్యవహారాలు నడపటం జనాభా ప్రాతిపదికన కుల నాయకులకు ప్రాధాన్యం ఇవ్వటం, ప్రచారం చేయించటం లాంటి చర్యలతో కులాల వారీగా ఓటర్లని ఆకర్శించే ప్రయత్నం చేస్తారు.
కానీ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రంగా కులాల వారీగా అధికారిక లెక్కలు లేకపోయినా కొందరు ఔత్సాహికులు అన్ని నియోజక వర్గాల్లోని లెక్కలు క్రోడికరించి రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్కల పేరిట ఇచ్చిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ ప్రకారం చూస్తే ఏపీలో
కాపులు, బలిజలు: 52,07,091,
ఎస్సీ మాల: 35,46,748,
రెడ్డి: 31,69,029,
మాదిగ: 15,85,725.,
యాదవ: 26,54,037,
ముస్లిం: 23,84,492,
కమ్మ: 29,87,911,
ఉత్తరాంధ్ర కాపులు: 15,18,044.
వైశ్యులు: 13,41,478,
బోయ వాల్మీకి: 9,69,868,
మత్స్య కారులు: 15,74,865,
కొప్పుల వెలమ: 9,65,814,
పద్మ శాలీలు: 9,24,351,
గౌడ: 19,78,826,
రజకులు: 8,41,457,
బ్రాహ్మణ: 7,41,655,
వడ్డెర్లు: 5,54,657,
నాయీ బ్రాహ్మణులు: 4,15,520,
క్షత్రియులు: 4,12,579,
కలింగులు:3,57,070
ఉన్నట్లు ఆ లెక్కలు చెబుతున్నాయి.
ఈ అంచనా పూర్తి స్థాయిలో నిజమో కాదో తెలియలంటే ప్రభుత్వాలు అధికారికంగా లెక్కలు విడుదల చేస్తే కానీ తెలియదు.