టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లు ప్రకటించిన విషయం విదితమే. పొత్తులో భాగంగా జనసేనకు24 సీట్లు ప్రకటించిన తర్వాత మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కాపు సంక్షేమ సేన ప్రెసిడెంట్ హరిరామ జోగయ్య స్పందిస్తూ కాపులకు ఇంకెప్పుడు రాజ్యాధికారం దక్కేది అని సూటిగా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాడు. అసలు ఈ సీట్ల పంపకం తెలుగుదేశం యివ్వటం, చేయి జాచి జనసేన తీసుకోవటం ఏమిటి? జనసేన పార్టీకి 24 సీట్లకు మించి నెగ్గగల స్తోమత లేదా? జనసేన పరిస్థితి ప్రజలలో అంత హీనంగా ఉందా? ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా?. అయినా వాళ్ళు సీట్లు ప్రకటించడం ఏంటి నువ్వు అన్ని తక్కువ తీసుకోవడం ఏంటి అని అడిగారు.
జనసేన శక్తిని పవన్ కళ్యాణ్ ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారో తెలియటం లేదు. అధికార పక్షాలు విమర్శలకు ఎటువంటి సమాధానాలు చెప్పాలి అని అడిగారు. సీట్లు ప్రకటన ముందే జనసేన పార్టీ ఏ ఏ నియోజక వర్గాలలో పోటీ చేస్తే బాగుంటుంది అంటూ తాను ఒక లిస్ట్ విడుదల చేసిన దానిని పట్టించుకోకపోవడం, ప్రకటన ముందు తనను కలవకపోవడంతో 24 సీట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని తెలిపారు.
24 సీట్లు తీసుకున్న 2 1/2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలని, సగం మంత్రి పదవులు జనసేనకు కేటాయించాలి అని ప్రకటిస్తేనే కాపు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అని తెలిపారు.