మంచో చెడో తనకున్న వాటిల్లో ముఖ్యాశయం తన కులాన్ని ఉద్ధరించడమే అని సందర్బం వచ్చినపుడల్లా ఒప్పుకుంటారు హరిరామజోగయ్య. అపార రాజకీయానుభవం, పలు పార్టీలలో పని చేసిన నేర్పరితనం అన్నిటి కన్నా ముఖ్యంగా వంగవీటి హత్య సమయంలో బాబు రాజకీయాలను అతి దగ్గరగా చూసిన వైనం(ఆయన ఆత్మకథ లోనే చెప్పారు) ఇవన్నీ కలిపి ఈ రాజకీయ కురువృద్ధుడికి ప్రత్యేకమైన దృక్కోణం వచ్చేలా చేసాయి.
వృద్ధాప్యం వల్ల పాలకొల్లు వంటి ఊరు దాటి బయటకు రాలేక పోయినా, రాష్ట్ర రాజకీయాల మీదా, సమకాలీన అంశాల మీదా ఆయన పట్టు అసమాన్యం. టీడీపీ జనసేన పొత్తు అని ప్రకటించిన దగ్గర నుంచీ ఆయన పవన్ కళ్యాణ్ కు లేఖలు రూపంలో ఏదో విధమైన సలహాలు ఇస్తూనే ఉన్నారు.
మొదటగా బాబుని నమ్మద్దని, పొత్తు అంటే అధికారంలో వాటా ఉంటుందా అంటూ, కాపులకు ఎన్ని సముచిత సీట్లు ఇస్తారూ అంటూ ఆరా తీసి, కాపుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టొద్దు అంటూ పవన్కు ఎప్పటికి అప్పుడు హెచ్చరికలు చేస్తూ అన్నిరకాలుగా సలహాలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇవేవీ నచ్చని పవన్కు ఆయన జోగయ్య లా కాకుండా జోరీగయ్య లా కనిపించారు. ఎప్పటికప్పుడు పక్కన నెట్టేస్తూ వచ్చారు.
తీరా ఎంగిలి చేయి విదిల్చినట్టు టీడీపీ జనసేనకు 24 సీట్లే ఇచ్చినపుడు షాక్కు గురయినా, అందులోంచి తేరుకుని కూడా అంతో ఇంతో కాపులకు న్యాయం చేసే సలహాలు మళ్ళీ పవన్కు ఇచ్చారు. అయితే పవన్కు చంద్రబాబు జపం తప్ప వేరే ధ్యాస లేక ఇవేవీ చెవికెక్కలేదు. దానితో హతాశయుడయిన జోగయ్య ఈరోజు మరొక లేఖ రాసారు. నా సలహాలు నచ్చనందున ఇకపై ఎటువంటి లేఖలు ఉండవు అనేది దాని సారాంశం. మరి ఈ విధంగా కాపు పెద్దలు కాడి దింపేస్తే మరి మిగతా కాపుల ఓట్లు జనసేన కు పడతాయో లేదో మరి. అందుకే పవన్ గురించి తెలిసిన తెలివైన లాయరు సుంకర దిలీప్ పొత్తు అని తెలిసిన రోజునే నీకో దణ్ణం బాబయ్యా అంటూ బయటకొచ్చి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. జోగయ్య వంటి వారు మాత్రం ఇలా ఊరికే పెన్నులో ఇంకు అవజేసుకుంటూ, చెవిటోడి ముందు బాజాలా పవన్కు అదే పనిగా లేఖలు రాస్తున్నారు.