గ్రాఫిక్స్కు పేటెంట్ హక్కుదారుడు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని పేరుతో బాహుబలి గ్రాఫిక్స్ చూపించిన చరిత్ర బాబుది. గ్రీన్ మ్యాట్ వేస్తే.. బురద చల్లాలని దుర్మార్గ ప్రయత్నం చేశారు. రా కదలిరా సభలు పెడుతున్నారు. వాటిని జనాలు పట్టించుకోవడం లేదు. అందువల్లే సిద్ధం సభలపై పడ్డారు. మేదరమెట్ల సిద్ధం సభకు లక్షల మంది స్వచ్ఛందంగా తరలివచ్చారు. సక్సెస్ అవ్వడంతో చంద్రబాబుకి కడుపుమంట పెరిగిపోయింది. ఎన్నికలకు ముందు ఆయన ఢిల్లీలో బీజేపీ పొత్తు కోసం తిరిగాడు. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ప్రజలకు ఏమీ ఒరగలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని తిట్టి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నారా లోకేశ్ మా అమ్మని తిట్టాడని చెప్పిన పవన్ ఇప్పుడు సిగ్గు లేకుండా వారితోనే కలిశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జెండాలు మార్చుకున్నారు. ప్రజలేమో వైఎస్సార్సీపీలోకి వచేస్తున్నారు.
బాబు మోసగాడు
చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. •టీడీపీ అధినేతకు విలువ లేవు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉంది. 2014లో డ్వాక్రా, రైతు రుణాల మాఫీ పేరుతో మోసం చేశారు. ఆయన్ను నమ్మితే మళ్లీ మోసం చేస్తారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు, పవన్ నరేంద్రమోదీ కాళ్లు పట్టుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ గుంపుగా వస్తున్నాయి. మంచి చేశాడు కాబట్టి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను నమ్ముకుని ఒంటరిగా బరిలోకి వస్తున్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్న నెరవేచ్చారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే.
జగన్కే ప్రజల ఆశీర్వాదం
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే ప్రజల ఆశీర్వాదం ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలకు విశేష స్పందన వచ్చింది. మేలు జరిగి ఉంటేనే ఓటు వేయని జగన్ చెబుతున్నారు. పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి బాబు ఏం చెప్తారు? 175 స్థానాల్లో మా పార్టీ గెలుస్తుంది. బాబు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడిన వీడియో ప్రదర్శించారు. ఇది ఆయన నిజస్వరూపం అన్నారు. ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.