మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విడుదల చేశారు. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏడు మేనేజ్మెంట్ల పరిధిలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 7వ తేదీన తుది ఫలితాలు ప్రకటిస్తారు. స్కూల్ అసిస్టెంట్ 2,299 పోస్టులు, ఎస్జీటీ 2,280, టీజీటీ 1,264, పీజీటీ 215 పోస్టులున్నాయి. ఆన్లైన్లో 12 నుంచి 22వ తేదీ మధ్య https://cse.ap.gov.in/loginhome లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 24న ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పించారు.
మార్చి 5 నుంచి హల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. 31న ప్రాథమిక కీ విడుదలవుతుంది. ఏప్రిల్ ఒకటో తేదీన అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తారు. 7న డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తారు. కాగా ఈనెల 8వ తేదీ నుంచి టెట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 18 వరకు https://cse.ap.gov.in/loginhome వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాలి. 19వ తేదీన ఆన్లైన్ మాక్ టెస్ట్ను అభ్యర్థులు రాయొచ్చు. 23 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 27 నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ప్రాథమిక కీ మార్చి 10న.. కీపై అభ్యంతరాల స్వీకరణ 11వ తేదీ వరకూ ఉంటుంది. ఫైనల్ కీ మార్చి 13న విడుదల చేస్తారు. 14వ తుదిఫలితాలు వెలువడతాయి. వేరే రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీకి చెందిన వారి కోసం కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.