తెలుగుదేశం పార్టీ నాయకులు నీతలు చెబుతారు. అవి వాళ్లకు కాదు.. ఎదుటి వ్యక్తులకు. తాము మాత్రం ఎంచక్కా నీతి తప్పి ప్రవర్తిస్తుంటారు. బ్యాంకులను మోసం చేయడంలో టీడీపీ నాయకులది అందె వేసిన చేయి. పరిశ్రమలు, కంపెనీల పేరుతో రుణాలు తీసుకోవడం.. కట్టకుండా తిరగడం వారికి వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబు చుట్టూ ఉండే వారిలో ఎక్కువ మంది చేసే పని ఇదే. సుజనా చౌదరి, రఘురామకృష్ణరాజు తదితరులు ఈ లిస్ట్లో ఉన్నారు. తాజాగా మరొకరు చేరారు. ఆయనే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు.
విశాఖ వన్టౌన్లోని లక్ష్మీటాకీస్ వద్ద ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిమెటడ్ అనే కంపెనీ ఉంది. యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా తోడల్లుడైన పరుచూరి వెంకట భాస్కర్రావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య ప్రభాకర్రావు ఉన్నారు. గంటా, కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్ని అమూల్యలు హామీదారులు. కంపెనీ విస్తరణ అంటూ డాబా గార్డెన్స్ శారదా వీధిలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. అయితే తిరిగి ఒక్క పైసా కూడా చెల్లించలేదు. దీంతో వడ్డీతో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.390.58 కోట్లు అయ్యింది. నీటీసులిచ్చినా స్పందించలేదు. దీంతో బ్యాంకు వారి ఆస్తుల వేలానికి చర్యలు తీసుకున్నారు.
పూచీకత్తుగా పెట్టిన స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంకు ప్రకటిచింది. ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, డైరెక్టర్లు పరుచూరి వెంకటభాస్కరరావు, రాజారావు, వెంకయ్య, ప్రభాకర్రావు, గంటా, కేబీ సుబ్రహ్మణ్యం అమ్యూల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ప్రతం విడుదల చేశారు. వారికి చెందిన పద్మనాభం మండలం ఐనద గ్రామం వద్ద ఉన్న 5,326.54 చదరపు గజాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా గతంలో స్వాధీనపరుచుకున్న స్థిరాస్తుల విక్రయానికి ఈనెల 18వ తేదీన బ్యాంకు నోటిసులిచ్చింది. ప్రత్యూష అసోసియేట్స్ పేరుతో ఉన్న వాణిజ్య భవనం, త్రివేణి టవర్స్లోని ఫ్లాట్ను ఏప్రిల్ 16న వేలం వేస్తామని అధికారులు ప్రకటించారు. కాగా పోర్టులో వ్యాపార లావాదేవీల కోసం గంటా స్వయంగా ఈ కంపెనీలు ప్రారంభించి కొంతకాలం డైరెక్టర్గా కొనసాగారని తెలిసింది.
చంద్రబాబు ఇలాంటి వారినే ప్రోత్సహిస్తున్నారు. నీతిగా ఉంటే ఆయనకు నచ్చదు. ప్రజల సొమ్మును కొల్లగొట్టే వారంటే బహు ప్రీతి.