1996 లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాలేశ్వర రావు మార్కెట్ తో పాటు కొన్ని భవన నిర్మాణాలకు అవసరానికి మించి ఖర్చు చేసి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసారు.. నగరం లో కాళేశ్వరరావు మార్కెట్ కాంప్లెక్స్ లో భవనాల నిర్మాణం కోసం కొత్తగా డిజైన్ లు రూపొందించగా వాటి అంచనాలను భారీగా పెంచేశారు. కేవలం ఈ భవనాల నిర్మాణం లోనే అప్పట్లోనే దాదాపు మూడున్నర కోట్ల రూపాయల అధిక అంచనాలు తయారు చేసి ప్రభుత్వ సొమ్ముని తన జేబులో వేసుకున్నారు.
భవనాల నిర్మాణం లో డిజైన్ లు రూపొంచందించడానికి వేసిన అంచనాల్లో నగరపాలక సంస్థ నియమించిన ఇంజనీరింగ్ నిపుణులు చదరపు అడుగుకు 650 రూపాయల చొప్పున అంచనా వ్యయాన్ని రూపొందించగా, ఎంత ఎక్కువ ఖర్చు చేసినా అది 300 దాటదు అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసారు.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సిద్దార్ధ కాలేజీ కి చెందిన సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ గా ఈ నిర్మాణాల గురించి అధ్యయనం చేయగా ఇంకా ఇంజనీరింగ్ పూర్తి కానీ విద్యార్థులు కూడా ఆ అంచనాలు భారీగా పెంచిన విషయాన్ని గుర్తించారు.. ఇది సామాన్యులకు కూడా అర్థం అయ్యే విషయమే కానీ ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్య తీసుకోకుండా, రోడ్డు మరియు భవనాల శాఖకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ నుండి చీఫ్ ఇంజనీర్ వరకు అందరూ ఆ అంచనాలను ఆమోదించడానికి కారణం ఆనాటి రాష్ట్రప్రభుత్వమే… దానికి కారణం అప్పటి విజయవాడ మేయర్ T.వెంకటేశ్వరరావు చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడు కావడమే… అలా ఈ మొత్తం అవినీతి వ్యవహారం వెనకుండి నడిపారు బాబు
దీనిపై అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ విచారణకి డిమాండ్ చేయగా దాటవేసి అసలేం జరగనట్లుగా మిన్నకుండిపోయింది… ఈ అవినీతి బాగోతాన్ని బాబు ప్రభుత్వం బయట పడనివ్వలేదు.. ఇలా ప్రతీ చిన్న విషయం లో భారీ స్థాయి అవినీతికి పాల్పడి తనకు, తన అనునయులకు లబ్ధి చేకూర్చడం బాబుకి ముందు నుండి ఉన్న ఆనవాయితీ….