ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్న సీఈసీ. దేశంలో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్. ఎన్నికలప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల ఈవీఎం లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.దేశవ్యాప్తంగా మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తొలిసారి ఓటు వేయనున్న 1.85 కోట్ల యువత .85 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటిదాకా ఎవరైనా ఓటు నమోదు చేసుకోకుండా ఉంటే అలాంటి వారికి కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది, కొత్త ఓటర్లు నమోదుకు 2024 ఏప్రిల్ 1 దాకా సమయం ఇచ్చింది. జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియని ముగిస్తామని తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం.
సి విజిల్ యాప్ ద్వారా ప్రజలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు. ఎన్నికల విధులకు దూరంగా వాలంటీర్లు తాత్కాలిక సిబ్బంది. టీవీ, సోషల్ మీడియా ప్రకటనలపై ఎలక్షన్ కమిషన్ నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రలోభాలను , కానుకుల్ని అడ్డుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్న కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలపై వేగంగా స్పందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. బ్యాంకులో లావాదేవీలపై లోతుగా పరిశీలిస్తామని వెల్లడించారు, అధిక మొత్తంలో లావాదేవీలు జరిగితే బ్యాంకులు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈడీ, ఐటి సహకారంతో అన్ని రాష్ట్రాలలో నిఘాను పెంచినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఫ్యాక్ట్ చెక్ చేస్తాం. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ నివారణకి అన్ని రాష్ట్రాలలో ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.