2009 ఎన్నికలపుడు కొన్ని ఛానెళ్ళు కే.ఏ. పాల్ చెప్పిన మాటల్ని నచ్చినట్టు ముక్కలుగా కత్తిరించి ప్రసారం చేసి అతనిని ఒక జోకర్లా చిత్రీకరించాయి. ఇందులో పాల్ తప్పిదం, చానెళ్ళ తప్పిదం సగం సగం ఉన్నాయి. కానీ 2024 ఎన్నికలలో మాత్రం తన చేతలతో, పూర్తి స్పృహతో పవన్ కళ్యాణ్ తనని తాను రాజకీయ విదూషకుడిగా చిత్రీకరించకుంటున్నారు.
మీరే కనుక నా వెనక ఉంటే అంటూ ఆకాశమెత్తు ప్రతిజ్ఞలు చేస్తారు. మరునాటికి తాటాకు చప్పుళ్ళు మనవి, మన దగ్గర శక్తి ఏది అంటూ చప్పబడిపోతారు. ఇలా ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా, నిన్న తిట్టిన వారిని ఈ రోజు పొగిడి, మొన్న మనల్ని ఎవరాపగలరంటూ రొమ్ము విరిచి, రేపు మనంతట మానం ఏం చేయలేని అమాయకులం అనీ భుజాలు వేలాడేసి ఇలా రకరకాల సర్కస్ ఫీట్లు చేస్తూ… తన చేతిలో ఉన్న అభిమానులను జెండా కూలీలుగా చేసి, తాను చంద్రబాబుకి బానిసగా మారి విచిత్ర రాజకీయాలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో… ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి ఉన్న అసమర్ధతను బయట పెట్టారు. పవన్ ఎమ్మెల్యే గా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలనీ, అదే యంపీగా పోటీ చేయాలంటే అమిత్షా టిక్ పెట్టాలనీ విమర్శించారు. అసలు వారిద్దరూ కీ ఇస్తే తప్ప ఆగలేని పరిస్థితిలో ఒక రాజకీయ పార్టీ అధినేత ఉండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
తరిచి చూస్తే ఆయన చెప్పింది నిజమనే అనిపిస్తుంది. పేరుకి పార్టీ, నాయకుడు అయినా కూడా పవన్ ఏం మాట్లాడాలి అన్నది కూడా చంద్రబాబు & కో కనుసన్నల్లోనే ఉండిపోతుంది. మొన్నటికి మొన్న లోకెష్ తన తండ్రే సీయం అని మాట్లాడటం నచ్చలేదని బహిరంగంగానే పవన్ చెప్పినా… “అరెరె నిజమే పవన్, మా వాడి తరపున నేను సారీ చెపుతున్నా. పొత్తు ధర్మం ప్రకారం ఇలా చేసుండకూడదు” అని చంద్రబాబు ఏమీ పవన్కి ఇప్పటి వరకూ సంజాయిషీ కాదు కదా, కనీసం అతను అన్న మాటని ఊసులో కూడా ఉంచలేదు. ఈరోజు పవన్ ఏం తినాలో కూడా చంద్రబాబు టిక్ పెట్టి చెబితేనే తినేలా పవన్ మారిపోయారు అన్న విడ్డూరమేం కాదు.