ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాకినాడ పార్లమెంట్ రీజియన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అది ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి వస్తున్న ఆనవాయితీ. అయితే ప్రస్తుతం ఈనెల 13వ తారీకున జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలో నియోజకవర్గాల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లా పరిధిలో అత్యంత కీలకమైనటువంటి కాకినాడ సిటీ రూరల్ మధ్య పోటీ మరింత వాడి వేడిగా సాగే పరిస్థితులు కనబడుతున్నాయి
కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుండి కాకినాడ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం నుండి కొరసాల కన్నబాబు పోటీ చేస్తున్నారు. వీరికి ప్రత్యర్థులుగా కూటమి నుండి కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నుండి వనమాడి కొండబాబు, జనసేన అభ్యర్థిగా పంతం నానాజీ పోటీ చేస్తున్నారు. అయితే అత్యంత కీలకమైన ఈ రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులు వారి వారి బలాబలాలను చూపించడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు మాది అంటే మాది అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా విజయాన్ని చూసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు మూడోసారి విజయాన్ని అందుకోవడానికి జగన్ గారు సుపరిపాలన, అందించిన సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కారణాలు కాగా… గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో వనమాడి కొండబాబు చేసినటువంటి మోసాలు, అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు అలాగే కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుండి పోటీ చేస్తున్న పంతం నానాజీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అసహనం రేపు జరగబోయే ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు తీరాలవైపు నడిపించే దిశగా సంకేతాలు ఇస్తున్నాయి. ఏ రకంగా చూసుకున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రత్యర్థుల కంటే బలమైన వారు కావడంతో కాకినాడ జిల్లాలో వైసిపి గెలుపు సునాయాసంగా సాగిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.