డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆద్వర్యంలో డియోన్ హబ్ ను కలెక్టర్ శుక్లా ప్రారంభించారు.. మొత్తం 2 కోట్ల రూపాయల వ్యయంతో 21 డ్రోన్లను కొనుగోలు చేయగా ఇవి 6-8 నిమిషాల్లోనే ఒక ఎకరాకు పురుగుమందుల పిచికారీ చేయగలదు..
పవర్ స్పేయర్స్ ద్వారా ఒక ఎకరానికి పిచికారీ చేయాలి అంటే 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుండగా, ఈ డ్రోన్ ల ద్వారా కేవలం 300 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది…
అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని ఆధునీకరిస్తాం, టెక్నాలజీ సాయంతో వ్యవసాయాన్ని పండగ చేస్తామని బాబు, డ్రోన్ లు కొనుగోలు చేసి రైతులకు ఇస్తాం అని లోకేష్ బడాయి కబుర్లు చెప్పి ఒక్కటంటే ఒక్క డ్రోన్ కొన్నది లేదు, రైతులకి ఇచ్చింది లేదు..
కానీ ఈ ప్రభుత్వం లో దేశంలో ఏ ప్రభుత్వం కొనుగోలు చేయని అన్ని డ్రోన్ లు కొనుగోలు చేసి సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు అందిస్తుంది.. దానిలో భాగంగా ప్రయోగాత్మకంగా దేవగుప్తం ప్రాథ్మిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టగా, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సహకార పరపతి సంఘాలకు అందించనున్నారు…
పని చేసే వారికి ప్రచారం అక్కర్లేదు, ప్రచారం తప్ప పని చేయని వారికి విలువ లేదు. అందుకే జగన్ గారు గొంతెత్తి చెప్పేది: “ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు, మీరే నా ప్రచార సారధులు” అని…