సీఎం జగన్ సామాజిక న్యాయం పేరుతో ప్రకటిస్తున్న సీట్లను చూస్తే చంద్రబాబుకు తలపట్టేసినట్లు ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటిదాకా ఏ యొక్క నియోజకవర్గానికి అభ్యర్థిత్వానికి ఖరారు చేసుకోలేక, టికెట్ ఎవరికి ఇస్తే, ఎక్కడ ఇంకో గ్రూప్ పనిచేయదో, ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలోని ఆశావహులుకు టికెట్ కేటాయిస్తే ఎక్కడ టీడీపీలోని పార్టీ వాళ్ళు చేయరో అని, పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల ఎక్కడ లేని టెన్షన్ పడుతున్నాడని భోగట్టా.
రా కదలిరా అంటూ సభలు పెడుతున్నా ప్రజలు రావడం లేదు. పవన్ కళ్యాణ్ పై ఆశలు పెట్టుకున్నా సభలేమీ నిర్వహించకుండా ఈ పాటికే చేతులు ఎత్తేశాడు. నారా లోకేష్ గత 3 నెలలుగా అరణ్యవాసం చేస్తున్నట్లు ఎక్కడా కనిపించకుండా ఉన్నాడు. మొన్నొకసారి బయట కనిపించినా ప్రజలతో మమేకం అవ్వడంలేదు. సీఎం జగన్ మాత్రం అతి సామాన్యమైన కార్యకర్తలకు సీట్లు కేటాయిస్తూ ముందుకు వెళ్తున్నాడు. చంద్రబాబు అసలు ఆ సాహసం చేయగలడా అనే సందేహం సాధారణ ప్రజల్లో నెలకొంది.
ఇటీవలే శింగనమల సమన్వయకర్తగా ఒక చిన్న కార్యకర్తకు అవకాశమిచ్చిన జగన్, మడకశిర నియోజకవర్గానికి ఒక మాజీ సర్పంచ్ ను నియోజక సమన్వయకర్తగా , నెల్లూర్ సిటీకి డిప్యూటీ మేయర్ను, మైలవరంకి ఒక జట్పిటీసీని సమన్వయకర్తగా నియమించాడు. చంద్రబాబు ఇంతటి ధైర్యం చేయగలడా? ముఖ్యమంత్రి జగన్ తన సభల్లో తరచుగా మీ ఇంట్లో నా వల్ల మేలు జరిగితే నన్ను ఆశీర్వదించండి లేకపోతే వద్దు అని సూటిగా చెప్తున్నాడు. ఇలా ఊహకైన చంద్రబాబు ఇంతటి మాట చెప్పగలడా? నా 14 ఏండ్ల పాలన నచ్చితేనే నాకు ఓటు వేయండని బాబు ఒక్కసారైనా అనగలడా?