జనసేనకు విరాళంగా చెక్కులిచ్చి ఎన్నికల టికెట్లు అడుతున్న వారిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎల్లో మీడియాలో వచ్చిన వార్త. రాయలసీమకు చెందిన ఓ నాయకుడు ఇద్దరితో వచ్చి చెక్కులిచ్చి వాళ్లకు టికెట్లు అడిగారట. పవన్ ఇలాంటివి ప్రోత్సహించనని తేల్చి చెప్పి పంపేశారట. జనం చెవిలో పువ్వులు ఉన్నాయని జనసేనాని, పచ్చ పత్రికలు భావిస్తున్నట్లు ఉంది. లేకపోతే ఇదంతా నమ్మే విధంగా ఉందా?..
అసలు జనసేన పార్టీని పెట్టిందే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ కోసమని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారు. సేనాని చేష్టలు కూడా అలాగే ఉంటాయి. బాబు మీద మాట పడనివ్వడు. అభిమానులేమో పవన్ సీఎం కావాలని కోరుతుంటే ఆయన మాత్రం నారా వారి మీదే ప్రేమ కురిపిస్తారు. ఎందుకంటే ప్యాకేజీ బంధం అలాంటిది మరి. అసలు టీడీపీ ఎన్ని టికెట్లు ఇస్తుందో తెలియదు. ఎక్కడ పోటీ చేయమంటుందో సేన అధినేతకు ఇంకా అవగాహన లేదు. సీట్ల కోసం పోటీ అంట. చెక్కులిస్తే వద్దన్నాడంట. వాస్తవానికి ఇలా జరిగి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీట్ల విషయంలో అసహనంగా ఉన్న కార్యకర్తల మెప్పు కోసం పవన్ ఇలాంటి సినిమా సీన్లు క్రియేట్ చేసి డ్రామాలు ఆడుతుంటారని చెబుతున్నారు. ఎటు తిరిగి ప్రస్తుతం ఎల్లో మీడియా చేతిలో ఉంది కాబట్టి చెప్పినట్లు రాసేస్తుందని ఆయన ధైర్యం. అసలు జనసేనకు హైప్ లేదు. ఏదో కొందరు యువకులు సినీనటుడని, సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని అభిమానం చూపిస్తున్నారంతే. టీడీపీతో పొత్తు కుదరడంతో అది కూడా పోయింది.
ఒక్క విరాళం వదలడు
పవన్కు ఎక్కడి డబ్బు కూడా సరిపోదు. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుంటూనే మరోవైపు విరాళాల కోసం పాకులాడుతుంటాడని పొలిటికల్ సర్కిల్లో విమర్శలున్నాయి. నిద్ర లేచింది మొదలు జనసైనికులను విరాళాలు అడుగుతూ సోషల్ మీడియాలో పేజీల్లో పోస్టులు పెడుతూనే ఉంటారు. సినిమా వాళ్ల నుంచి చాలాసార్లు డబ్బులు తీసుకున్న సందర్భాలున్నాయి. మెగా కుటుంబ సభ్యులైతే అంతిచ్చారు.. ఇంతిచ్చారని వార్తలు వస్తూనే ఉంటాయి. అలాగే పవన్ తన పాత సినిమాలు రీ రిలీజ్ చేయించి పార్టీకి విరాళాలు ఇప్పించుకున్న సంఘటనలు ఇటీవల చాలా చూశాం.
బీద అరుపులు
పవన్ నేను సినిమా చేస్తే వందల కోట్ల రూపాయలు వచ్చి పడతాయి అంటాడు. ఆ సొమ్ముతో పార్టీని అద్భుతంగా నడపొచ్చు. కానీ జరగదు. విరాళాలు అవసరమైన ప్రతి సారి స్టాఫ్కు జీతాలు ఇవ్వలేకపోతున్నా.. కారు ఈఎంఐలు కట్టలేకపోతున్నానంటూ బీద అరుపులు అరుస్తాడు. ఆయన అన్న నాగబాబు తమ్ముడికి వంత పాడుతూ సింప్లిసిటీకి మారుపేరంటూ బిల్డప్ ఇస్తారు. తీరా పవన్ పిల్లలేమో విదేశాల్లో చదువుకుంటున్న పరిస్థితి ఉంది. సమావేశాలకు చార్టెడ్ ఫ్లైట్స్లో తిరుగుతూనే కార్యకర్తల వద్ద సింపతీ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి కౌలు రైతులను ఆదుకునేందుకు విరాళమివ్వండి అంటాడు. తీరా డబ్బు చేతికొచ్చాక కొందరికి చెక్కులిచ్చి చేతులు దులుపుకొంటాడు. తర్వాత ఆ ఊసే ఉండదు. పవన్ రాజకీయాలను వ్యాపార కోణంలో చూస్తాడు. సినిమాకు కాల్షీట్లు ఇచ్చి ఎలా ముక్కుపిండి వసూలు చేస్తాడో రాజకీయాల్లోనూ అంతే. వీకెండ్లో వచ్చి బాబు ప్యాకేజీ, కార్యకర్తల నుంచి విరాళాలు కలెక్ట్ చేసుకుని వెళ్లిపోతుంటాడు. అలాంటి వ్యక్తిని చెక్కులిస్తే తిట్టి పంపేశాడని ప్రచారం చేయడం ఏమన్నా బాగుందా డియర్ ఎల్లో మీడియా..