ఎన్టీఆర్ కి కూతురు, దగ్గుబాటి చెంచు రామయ్య కోడలు అయిన పురందేశ్వరి ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత నుండి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. అంతటి ఎన్టీఆర్ కూతురు అయ్యుండి కూడా రాజకీయాల్లో తన మార్క్ ని ఎప్పుడు చూపెట్టలేకపోయింది. మిగతా సంతానం లా రాజకీయాలు వదిలేసి ఉండొచ్చు కానీ ఆమె మాత్రం రాజకీయాల్ని పట్టుకు వేలాడుతుంది. మహిళ గా అది అభిందించాల్సిన విషయమే కానీ సొంతగా ఎప్పుడు నాలుగు ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ సంపాదించుకోలేకపోవడమే శోచనీయం..
2004 లో కాంగ్రెస్ తరపున ఎంపీ గా గెలిచింది, 2006 లో కేంద్ర మంత్రి పదవి వరించింది. 2014 లో కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో జాయిన్ అయ్యి చాలా కాలం పాటు సైలెంట్ గా ఉన్నారు..టీడీపీ ని అణచి బీజేపీ ని ఆంధ్ర ప్రదేశ్ లో ఉనికిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం సోము వీర్రాజు ని రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించి పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించింది. నాటి నుండి పురందేశ్వరికి మళ్లీ పదవీ కాంక్ష మొదలైనట్లు ఉంది. బాబు నైజం తెలిసిన బిజెపి అధిష్టానం బాబును దూరం పెట్టగా టిడిపి ని బిజెపి కి దగ్గర చేయాలని ఆమె చేయని ప్రయత్నాలు లేవు, ఇందులో బాబు స్వార్థం కన్నా పురంధేశ్వరి స్వార్థమే అధికం.
టీడీపీ బీజేపీ పొత్తు కుదిరితే బీజేపీ తరపున పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి ఎంపీ గా పోటీ చేస్తే టీడీపీ ఓట్ల ద్వార ఎంపీ గా గెలిచి తద్వారా కేంద్రం లో మంత్రి పదవి పొందాలనే పెద్ద ఆశయం తో రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు పురందేశ్వరి..
అలా ఆశించడంలో ఏ తప్పూ లేదు కానీ, ఎన్టీఆర్ కూతురుగా, చెంచు రామయ్య కోడలిగా రాజకీయాల్లో ఉంటూ కూడా తనకంటూ ప్రత్యేకంగా నాలుగు ఓట్లు సంపాదించుకోలేకపోవడం ఎంత దారుణం. సొంత నియోజకవర్గంలో కూడా వారికి వంద ఓట్లు పడే పరిస్థితి లేదు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తరపున ఎమ్మెల్యే గా పోటీ చేస్తే తన ఇల్లు ఉన్న ఊర్లో కూడా టీడీపీ కి మెజారిటీ వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు వారి సొంత బలం. ఇప్పుడు పురంధేశ్వరి కూడా తన సొంత నియోజకవర్గం అయిన ఒంగోలు పార్లమెంట్ సీట్ నుండి పోటీ చేయరు, ఖచ్చితంగా వైజాగ్ నుండే పోటీ చేస్తారు గతంలో కూడా వైజాగ్ నుండే ఎంపీ గా గెలిచారు..
అంతటి ఘన కీర్తి కలిగిన ఎన్టీఆర్ కూతురికి కేంద్ర మంత్రి పదవి కోసం బీజేపీ పార్టీ నుండి సీటు, తన తండ్రి ని పదవీచ్యుతుణ్ణి చేసి ఆయన మరణానికి కారణం అయిన బాబు మద్దతు కావాల్సిన దరిద్రం వారికి పట్టింది.. ఇదంతా చూస్తూ ఎన్టీఆర్ ఆత్మ ఇంకా ఇంకా ఘోషిస్తూ ఉంటుంది…