ఇస్రో విజయాల పరంపరలో మరొక కీర్తి కిరీటం చేరింది. చంద్రయాన్ సక్సెస్ తర్వాత ప్రపంచ దేశాల చూపుని తనవైపుకు తిప్పుకున్న ఇస్రో, ఆపై చంద్రుడి దక్షిణ ధృవం పై సాధికారంగా చేసిన సాఫ్ట్ ల్యాండింగ్ మిగతా దేశాల అంతరిక్ష కేంద్రాలను ముక్కున వేలేసుకునేలా చేసింది.
చంద్రుడి మీదకు పంపిన రాకెట్ సక్సెస్ అవగానే, ఆపై సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఆదిత్య అనే పేరుతో మరొక ఉపగ్రహాన్ని పంపి అక్కడా విజయాన్ని చవిచూసింది. ఇపుడు కొత్తగా.. నిన్న భూమి, సముద్ర ఉపరితలాల మార్పుపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన GSLV F-14 రాకెట్ కూడా విజయవంతంగా ఉపరితలంలో కి ప్రవేశపెట్టి మరొక విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది.
ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించబడ్డ జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ F14 పిలవబడే GSLV-F14 పదేళ్ళపాటు మనకు సేవలందించనుంది. దీని బరువు 2,275 కిలోలు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు వారి విజయాలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు.