ఈ నెల 7,8 తేదీల్లో సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటనలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులలో పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. కాగా సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా సాగనుంది. తాడేపల్లి నివాసం నుండి సాయంత్రం 4 గంటలకు కడప చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం వైఎస్సార్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొని, ఆ రాత్రికి వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్లో బసచేస్తారు.
ఉదయం 8.20 గంటలకు ఇడుపులపాయ గెస్ట్ హౌస్నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రారంబించి అనంతరం బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్కు చేరుకుని ప్రారంభిస్తారు. పిమ్మట డాక్టర్ వైఎస్సార్ జంక్షన్కు చేరుకుని అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్కు చేరుకుని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గాంధీ జంక్షన్కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైఎస్సార్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్కు చేరుకుని ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం సంయూ గ్లాస్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.