సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికలో, ఎన్నికల సమాయాత్తంలో మిగతా రాజకీయ పక్షాల కన్నా దూకుడు ప్రదర్శిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత సీఎం జగన్ కార్యకర్తలను సిద్ధం చేయటంలో కూడా తనదైన మార్క్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. సిద్ధం అనే పదంలో ఉన్న ఉద్వేగాన్ని ఒడిసిపట్టుకొని తన కార్యకర్తలని ఎన్నికల యుద్దానికి సన్నద్ధం చేస్తున్న తీరు విశ్లేషకులని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ క్రమంలో మొదటి రెండు సభలు వేడిని రాజేయగా అనంతలో జరిగిన మూడో సభ వైసీపీ శ్రేణులు మొత్తానికి నూతన ఉత్తేజం కలిగించింది.
ఈ క్రమంలో నేడు జరిగిన నాలుగవ సభ జన జాతరని తలపించగా సభలో సీఎం జగన్ ప్రసంగం కార్యకర్తలని ఊర్రూత లూగించి ఎన్నికల యుద్దానికి పూర్తి స్థాయిలో సిద్ధం చేసిందని చెప్పొచ్చు .
సభలో ప్రసంగించిన జగన్ గత కొన్నేళ్లుగా ప్రసంగిస్తున్న తన శైలికి భిన్నంగా 2019 కి ముందు ప్రసంగించిన పోరాట యోధుడి తరహాలో మాట్లాడటం విశేషం .
షుమారు నాలుగు గంటలకి ప్రసంగం ప్రారంభించిన జగన్ జమ్మిచెట్టుమీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చింది. నాకు నటించే పొలిటికల్ స్టార్స్ లేరు. ఆకాంశంలో నక్షత్రాల్లా ప్రతి ఇంట్లో నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.నాకు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నా. మరో 4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. ఈ పార్టీలన్నింటికీ సేనాధిపతులే ఉన్నారు తప్ప సైన్యం లేదు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ.. అటువైపు ఉంది.చంద్రబాబు సైకిల్ కి ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్ కి టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్ కి చక్రాలే లేవు, చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిపోయింది. ప్రజలను దోచుకునేందుకు పంచుకునేందుకు చంద్రబాబుకు అధికారం కావాలి.చంద్రబాబు ఇచ్చే వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలు కు ఏమన్నా తేడా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబుది కిచిడి మేనిఫెస్టో.చంద్రబాబు ఏమి చేయమంటే దత్త పుత్రుడు అది చేస్తాడు. మన ఫ్యాను గిర్రున తిరిగేందుకు కావలసిన కరెంట్ ఇతర పార్టీల నుండి రాదు,ఇతర పార్టీల పొత్తుల వల్ల రాదు,నేరుగా ప్రజల నుండి వస్తుంది,అది జగన్ మార్క్ రాజకీయం.ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది,అర్జునుడి పాత్ర నాది అంటూ కార్యకర్తలకు అగ్రస్థానం ఇస్తూ సాగిన ప్రసంగం వైసీపీ కార్యకర్తలకు విందు భోజనంలా సాగిందని చెప్పొచ్చు.