ఇప్పటికే మూడు సిద్ధం సభలను విజయవంతంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ ఈ నెల పదవ తారీఖున బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగవ సిద్ధం సభ నిర్వహించనుంది.
సీఎం జగన్ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సిద్ధం సభలను విజయవంతంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ ఈ నెల పదవ తారీఖున బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగవ సిద్ధం సభ నిర్వహించనుంది.
ఈ సభ తొలుత పల్నాడు జిల్లాలో నిర్వహించాలి అనుకొన్నా అనంతపురం జిల్లా సిద్ధం సభకన్నా కూడా అధికంగా జనం తరలివస్తారన్న అంచనాల మేరకు సరిపడే స్థలం, అనుకూలమైన ప్రయాణ సౌకర్యాల నిమిత్తం నేషనల్ హైవేకి దగ్గరగా ఎక్కువ స్థలం సిద్ధం చేయటానికి అనుకూలంగా ఉన్న అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల ప్రాంతాన్ని ఎంచుకొన్నారని తెలుస్తుంది. ఎల్లుండి బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరగబోయే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్దంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు
కాగా మేదరమెట్లలో జరగబోయే సిద్ధం సభకు అనంతపురం సిద్ధం శభాని మించి లక్షలాదిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తరలి రానున్నారని తెలుస్తుంది . ఈ సభలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేనిఫెస్టోపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. సీఎం జగన్ షెడ్యూల్ ఇలా కొనసాగనుంది. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ జరిగే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్దం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.