దేశంలో అత్యంత ప్రభావితం చేసే టాప్ 100 శక్తివంతుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి 56వ స్థానం దక్కింది . నిన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిలీజ్ చేసిన లిస్ట్ లో టాప్ 100 శక్తివంతమైన వారిలో స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ లిస్ట్ లో మొదటి ఐదు స్థానాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, RSS చీఫ్ మోహన్ భగవత్, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా డీ వై చంద్రుచుడ్ , భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చోటు దక్కించుకున్నారు.వీరి సరసన చోటు దక్కించుకోవడం జగన్ మోహన్ రెడ్డికి కీర్తిగానే చెప్పుకోవచ్చు.సాధారణ సమయంలో ఇలాంటి లిస్టులుకు పెద్ద ప్రాధన్యత ఉండదు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ లిస్టుకు ప్రాధ్యానత చేకూరింది. జగన్ మోహన్ రెడ్డికి 56 వ స్థానం దక్కగా మరో ఏ యితర నాయకులు మన రాష్ట్రము నుంచి చోటు దక్కించుకోలేదు.
ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఐదేళ్ల తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలు – సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు (DBT) రూ. 2.55 లక్షల కోట్లు, నాన్-DBT సహాయంగా రూ.1.07 లక్షల కోట్లు పంపిణీ చేసింది.జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన గ్రామ,వార్డు సచివాలయాలు ద్వారా ప్రజల వద్దకే పాలనా అందించడం ద్వారా ఇంతటి ప్రజాధారణను కూడబెట్టింది. 2019లో సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకొని 2024 ఎన్నికలలో కూడా అలాంటి విజయాన్ని నమోదు చేయడానికి ప్రజల్లో వ్యతిరేకత కూడగట్టుకున్న ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా నిరాకరించడం ద్వారా జగన్ పై మరింత ప్రజల్లో నమ్మకం కలిగించింది.