పేదలను ఆదుకోవాలంటే మంచి మనసు ఉండాలి. వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే ధైర్యం ఉండాలి. ఈ రెండు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్నాయి. 2019లో ఆయన సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స విషయంలో ఉదారంగా సాయం చేస్తున్నారు. కిడ్నీ రోగులకు కొండంత అండగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచింది.
ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కిడ్నీ వ్యాధులు ఆందోళనకర స్థాయిలో ఉండేవి. ఎ.కొండూరు తండాల్లో మరీ ఎక్కువ. ఇది పెద్ద సమస్యగా మారింది. కిడ్నీ వ్యాధుల కట్టడికి జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రోగుల పరిస్థితి మరింత విషమించకుండా చూడటంతోపాటు, కొత్త రోగులు నమోదు కాకుండా చూస్తున్నారు. మరోవైపు డయాలసిస్ సేవలను సైతం విస్తృతం చేశారు. ఎ.కొండూరు తండాల నుంచి డయాలసిస్ కోసం వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే వాహనం ఏర్పాటు చేసింది.
ఇదీ జరిగింది
ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడ సిద్థార్థ వైద్య కళాశాలకు చెందిన సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఎస్పీఎం) విభాగం వైద్యుల బృందంతో క్రానిక్ కిడ్నీ డీసీజెస్పై ప్రాథమిక సర్వే నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల వైద్యులతో పాటు, ప్రభుత్వాస్పత్రిలో కిడ్నీ వ్యాధుల వైద్యులతో తండాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేయించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్య బృందం నిత్యం పర్యటిస్తూ పరీక్షలు చేయడమే కాకుండా మందులు అందిస్తున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వాడే మందులను సైతం సెంట్రల్ డ్రగో స్టోర్స్ వారు కొనుగోలు చేసి, పోస్టు ద్వారా వారికి సమీపంలోని విలేజ్ హెల్త్ క్లినిక్లకు పంపుతున్నారు. అక్కడి నుంచి సీహెచ్, ఏఎన్ఎం, ఆశాలు వెళ్లి రోగికి అందజేస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ప్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో వ్యాధులపై విసృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నివారించడం ద్వారా కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు. కళాజాత బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తున్నారు.
ఒకప్పుడు కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకోవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎ.కొండూరులోనే ఏర్పాటు చేయడం తండా వాసులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సైతం రోజుకు 100 మందికిపైగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో కూడా ఉచితంగా చేస్తున్నారు. ఇంకా ప్రతి నెలా 10 వేల రూపాయల చొప్పున పింఛన్లు అందజేస్తున్నారు.