2016లో కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల పేరుతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు విజయవాడలో 30 ఆలయాలు కూల్చేశారు. జగన్ సీఎం అయ్యాక ఎనిమిది ముఖ్యమైన గుడులను పునఃనిర్మించారు. 2021లో సీఎం శంకుస్థాపన చేయగా రూ.3.87 కోట్లతో పనులు పూర్తి చేశారు. గత డిసెంబర్ 8వ తేదీన భక్తులకు అంకితమిచ్చారు. చంద్రబాబును మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే ఘనుడు. 2015లో గోదావారి పుష్కరాల్లో తన ప్రచారం కోసం 29 మంది భక్తులను పొట్టన పెట్టుకున్నాడు. జగన్ సీఎం అయ్యాక ఆలయాలను అభివృద్ధి చేస్తే ఓర్వలేక తెలుగుదేశం, జనసేన అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి.
చంద్రబాబు హిందూ ఆలయాల విషయంలో నిర్లక్ష్యం వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం నిధులు కేటాయించి అభివృద్ధి చేయించారు. ఉదాహరణకు విజయవాడలోని దుర్గగుడి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొంత కాలం క్రితం రూ.70 కోట్ల కేటాయించారు. ఇందులో రూ.5.70 కోట్లు వెచ్చింది ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయం ఆలయం అద్భుతుంగా రూపుదిద్దుకుంది.
ఆనాడు ఇలా..
2016లో తెలుగుదేశం అధికారంలో ఉంది. అప్పట్లో చంద్రబాబు కృష్ణా పుష్కరాల పేరిట ఇంద్రకీలాద్రిపై పలు నిర్మాణాలను కూల్చి వేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని భవానీ దీక్ష మండపం, షాపింగ్ కాంప్లెక్స్, పరిపాలనా భవనంతోపాటు రాధాకృష్ణ విగ్రహాల వద్ద అన్నదాన, ప్రసాదాలపోటు తయారీ, యాగశాల వద్ద అన్నదాన భవనాలను కూల్చి వేయడం జరిగింది. అప్పటికి అన్నదాన భవనం, ప్రసాదాల తయారీ కేంద్రాన్ని నిర్మించి పదకొండేళ్లే అయింది. ఆ విషయాన్ని ఆలయ పెద్దలు చెప్పినా పట్టించుకోలేదు. నిర్మాణానికి రూ.20 లక్షలు వ్యయం చేయగా కూల్చేందుకు రూ.20 లక్షలు వెచ్చించడం గమనార్హం.
జగన్ వచ్చాకే..
టీడీపీ ప్రభుత్వం కూల్చివేసిన భవనాల స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. అన్నదాన భవనం, ప్రసాదాల తయారీ కేంద్రాలతోపాటు దాతల సహకారంతో యాగశాల, పూజా మందిరాలను నిర్మించాలని భావించారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్లో భాగంగా యాగశాల, పూజా మందిరాలను దేవస్థానం నిర్మించాలని అనుకోగా.. సంగా నరసింహరావు అనే దాత రూ.5 కోట్లతో యాగశాల నిర్మాణానికి ముందుకొచ్చారు. ఇప్పటికే యాగశాల పునాదుల పనులు పూర్తి కాగా, నిర్మాణానికి అవసరమైన రాత్రి స్తంభాలు, ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. దసరా నాటికి పూర్తయ్యే అవకాశముంది.
మొత్తంగా..
దుర్గగుడి అభివృద్ధిలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీగా నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా మల్లేశ్వరాలయం నిర్మించారు. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, స్వర్ణ కలశం, దేవతా విగ్రహాల ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. చుట్టూ నిర్మించిన రాతి మండపంలో శిల్ప నిర్మాణం ఆకట్టుకుటోంది. రాతి మండపంలోనే స్వామికి సేవలు నిర్వహించేలా విశాల ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. నిత్యం ఆది దంపతుల శాంతి కల్యాణంతోపాటు ప్రతి ఆదివారం సూర్యోపాసన సేవలు చేసేలా నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయం 500 ఏళ్లపాటు పటిష్టంగా ఉండేలా నిర్మాణం చేసినట్లు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటు న్నారు. దుర్గగుడిపై మొత్తంగా రూ.200 కోట్ల వ్యయంతో వివిధ పనులు మాస్టర్ ప్లాన్లో భాగంగా జరుగుతున్నాయి.