దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా ఇంటింటికి డాక్టర్ ని పంపించి ఆ ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాటికి సంబంధించిన వైద్యం అక్కడే పరిష్కారమైతే అక్కడే చేసి లేకపోతే పెద్ద హాస్పిటల్స్ కి రిఫర్ చేయడం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ సాధ్యం కానిది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా దీనిని సాధించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు తమ గ్రామ వార్డు సచివాలయాల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ఈ పథకం యొక్క గొప్ప ఉద్దేశం. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో ఏ గ్రామాన్ని ఏ ఇంటిని వదిలి పెట్టకుండా ఏ వ్యక్తిని ఆరోగ్య సేవలకు దూరం కానీయకుండా ప్రతి వ్యక్తికి ఆరోగ్య సంరక్షణ అందించాలనే గొప్ప ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జగనన్న ఆరోగ్య సురక్ష గత ఐదు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది. మొదటి విడతలో మొత్తం 60.28 లక్షల మంది ప్రజలు తమ సొంత గ్రామాలు వార్డుల్లో వైద్య నిపుణులు నుంచి నాణ్యమైన వైద్య సేవలను పొందారు. రెండో విడతలో 1.45 కోట్ల ఇళ్ళకు వెళ్లి, ఒక్కొక్కరికి ఏడు కేటగిరీలలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రికార్డు స్థాయిలో 6.45 కోట్ల పరీక్షలు నిర్వహించారు. ఈ హెల్త్ ప్రొఫైల్ భవిష్యత్తులో చేపట్టబోయే వైద్య కార్యక్రమాలు, ప్రణాళికకు, లక్ష్యాలు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
జగనన్న సురక్ష మొదటి విడత రెండో విడతలో భాగంగా మొత్తం 1,66,828 మంది రోగులను ఉన్నత కేంద్రాలలో తదుపరి చికిత్స కోసం ప్రిఫర్ చేయగా వారందరికీ తగిన చికిత్సను అందించారు.ఇందులో 80,115 మంది రోగులకు కంట శుక్లాల శస్త్ర చికిత్స చేసుకున్నారు మిగిలిన 86717 మంది రోగులకు వివిధ రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ లో చికిత్స లభించింది.జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 5,73,545 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు బిపి షుగర్ కు చెక్ పెట్టొచ్చు. బీపీ షుగర్ మొదటి స్టేజ్ లో ఉన్నవారికి మొదటిలోనే అవి దీర్ఘకాలికంగా ఉండకుండా అరికట్టవచ్చు.గ్రామీణ స్థాయి ప్రజలు సగం మందికి వారికి బీపీ షుగర్ ఉందన్నా విషయమే తెలియదు. అలాంటి వారికి ఇంటి వద్దకే వచ్చి పలు టెస్టులు ద్వారా నిర్ధారణ చేసి వారికి మందులు అందజేస్తున్నారు. ఈ టెస్ట్ ల ద్వారా కొత్తగా బీపీతో బాధపడుతున్న 2,51,529 మందిని, మధుమేహంతో 1,54,248 మందిని కొత్తగా గుర్తించారు. వీరికి చికిత్స అందించడమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతినెల వీరి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఈ సురక్ష ప్రోగ్రాం ద్వారా బీపీతో మధుమేహంతో బాధపడే వారిని కనిపెట్టకపోయి ఉంటే వారికి జీవిత కాలం బీపీ మధుమేహంతో దీర్ఘకాలికంగా బాధపడాల్సి వచ్చేది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తమ ఇంటికి ఖరీదైన మందులు ఉచితంగా పంపిణీ చేయడం పట్ల రోగులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేటి వరకు దాదాపు లక్ష పదివేల మంది రోగులు వారి ఇంటి వద్దకే ఐరన్ ఔషధాల పంపిణీ అయ్యాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఔషధాలను ఎలా వాడాలో ఎంత మోతాదులో తీసుకోవాలో ఇంటి వద్దకే వచ్చి చెప్పి వెళ్తున్నారు. తదుపరి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ అవసరమైన యెడల పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ స్థాయిలో ఆరోగ్య రంగంలో ఎనలేని కృషి చేస్తోంది ఏపీ ప్రభుత్వం .