విశాఖ జిల్లాలో రుషికొండపై ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన సీఎం క్యాంపు ఆఫీస్ భవనాలను ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. నేడు మంచి రోజు కావడంతో ఈ భవనాలను ప్రారంభించనున్నట్లు రోజా తెలిపారు. ప్రారంభోత్సవంలో అన్ని సాంప్రదాయ పద్ధతులలో పూజలు జరిగినట్లు గుడివాడ అమర్నాథ్ మీడియాకు వెల్లడించారు.
వైజాగ్ ను సీఎం జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానన్న తరుణంలో ఈ భవనాల ప్రారంభం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసిన తరవాత పాలనకు అనుగుణంగా అన్ని బిల్డింగ్ లు ఏర్పాటు చేసారు . ఈ సందర్బంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఇప్పుడు నిర్మించిన 8 బ్లాక్ లను రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చని అధికారుల ఆదేశానుసారం ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీసుగా ఉంచాలా లెకపొతే రిసార్ట్స్ గా ఉంచాలా, భద్రతాపరమైన అంశాలను చూసి నిర్ణయిస్తామని మీడియాతో తెలిపారు.