సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం లాంటి అంశాలలో తలమునకలయ్యాయి . ఎన్నికల సన్నద్ధతలో మిగతా పార్టీలు అన్నిటి కన్నా పై చేయి సాధిస్తూ జిల్లాల వారీగా వరుసగా సమన్వయకర్తల్ని ప్రకటించుకొంటూ వస్తున్న జగన్ ఈ రోజు తుది లిస్టు విడుదల చేయనున్నారు.
ఈ నేపధ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ పర్యటించనున్నారు.. అధికారికంగా ఖరారైన సీఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. మార్చి 16 న ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్ఆర్ ఘాట్లో ప్రార్ధనల అనంతరం మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ అభ్యర్ధుల ప్రకటన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
2019 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఇడుపులపాయ పర్యటించి మహానేత వైఎస్సార్ ఘాట్ దర్శించిన తర్వాత అక్కడి నుండే అభ్యర్థుల లిస్టు విడుదల చేసిన నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, నేడు కూడా అదే నమ్మకాన్ని అనుసరిస్తూ ఇడుపులపాయ నుండే వైఎస్సార్సీపీ నుండీ పోటీ చేయబోయే 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 25 మంది పార్లమెంట్ అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేయనున్నారు.
మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా నేడు ఎలెక్షన్ నోటిఫికేషన్ విడుదల చెయ్యనుంది. ఆ మేరకు ఈ రోజు సాయంత్రం 3.00 గంటలకు పాత్రికేయ సమావేశం నిర్వహణ గురించి సమాచారం విడుదల చేసింది ఈసీ.
జరగబోయే పార్లమెంట్, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎలెక్షన్ ల నిర్వహణకు సంభందించి తేదీలు, కోడ్ నిభందనలు లాంటి అంశాల పై సదరు మీటింగ్ లో స్పష్టత వస్తుంది .