రానున్న ఎన్నికల సంగ్రామంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు అనే అంశంపై స్పష్టత వచ్చింది. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు తన సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో తెలిపాడు. టిడిపి జనసేన బిజెపి కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తాను అనే విషయం బయటకు రాగానే, పిఠాపురం టిడిపి కార్యకర్తలు ఆగ్రహ ఆవేశాలకు గురయ్యారు.
పొత్తులో భాగంగా ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే స్థానం నుంచి అంతటి వ్యతిరేకతను కూడగట్టుకోవడం బహుశా రాజకీయ చరిత్రలో మొదటి సారి ఏమో, ఏ విషయమైనా జనసేన కార్యకర్తలే స్వాగతించాలా టిడిపి కార్యకర్తలు స్వాగతించలేరా అనే ప్రశ్నలు జనసేన కార్యకర్తల్లో మొదలవుతున్నాయని సమాచారం.
పొత్తులో భాగంగా కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి చంద్రబాబు పోటీ చేస్తానంటే జనసేన నాయకులు కార్యకర్తలు స్వాగతించారు. కానీ పిఠాపురంలో మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే టిడిపి నాయకులు కార్యకర్తలు స్వాగతించడం లేదు. బహుశా చంద్రబాబుకు కావలసింది కూడా పవన్ కళ్యాణ్ ఓటమి కావచ్చు. కూటమి పొత్తులో భాగంగా ఆ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని చంద్రబాబుకి ముందే తెలిసిన తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తాడు మీరు స్వాగతించాలి అని ముందే చెప్పే అవకాశం ఉన్న ఏ మాత్రం పట్టించుకోకుండా గమ్మున ఉండడంలో ఆంతర్యం ఏమిటి
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా ఎస్వీఎస్ఎన్ వర్మ ఉన్నారు. వర్మ నిన్న మీడియాతో మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా తాను టిడిపి నే నమ్ముకోని ఉన్నానని నా స్థానం నుంచి వేరే ఇంకెవరునో పోటీ చేయించడం భావ్యం కాదన్నారు. ఏదేమైనప్పటికీ రాబోవు ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా అయినా ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.