చంద్రబాబు నాయుడు గొప్ప విజనరీ. పరిశ్రమలు నెలకొల్పాడు. ఉద్యోగాలు కల్పించాడు. అనేక సంవత్సరాలుగా ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం ఇది. కానీ ఆయన హయాంలోనే రాష్ట్రంలో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. తన వారికి లబ్ధి చేకూర్చేందుకు ఇలా చేశారని విమర్శలున్నాయి. చక్కెర కర్మాగారాలకు జగన్ను పీల్చిపిప్పి చేశాడని సమాధి కట్టాడని రామోజీ పత్రిక ఈనాడు రాసింది. కానీ నారా వారు అధికారంలో ఉన్నప్పుడే పదిలో తొమ్మిది సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈనాడు అబద్ధాలకు అంతు లేకుండా పోతోంది. ప్రతి అంశంలో నిజాలు దాచేసి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందిస్తోంది. ఆ కోవ కిందకే ‘తీపి మాటలు చెప్పి.. పీల్చి పిప్పి’ కథనం వస్తుంది. బాబు హయాంలో చిత్తూరు, రేణుగుంట, కోవూరు, ఎస్వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. వాటిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పునరుద్ధరించింది నిజం. కానీ వాటిని మళ్లీ చంద్రబాబు మూతపడేలా చేశారు. లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టాలని చూశారు. కానీ కుదరకపోవడంతో 2003-04లోనే మూతపడేలా చేశారు.
ఇక చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెల్లించారు. ఐదేళ్లలో రైతులకు రూ.346.47 కోట్లు ఇచ్చారు. ఇంకా ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ.72.86 కోట్లను వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారే ఇచ్చింది. బాబు హయాంలో నిర్వీర్యమైన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయరాయ కర్మాగారాల పునరుద్ధరణను ఉప సంఘం సిఫార్సుల మేరకు చర్యలు చేపట్టినా చెరుకు దొరకని పరిస్థితి నెలకొంది. కనీసం 4 నెలలకు 23.09 లక్షల టన్నుల చెరుకు అవసరం కాగా, రూ.2.80 లక్షల టన్నులకు మించి లభించడం లేదు. ముడిసరుకు లేకుండా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునికీకరించడం వల్ల ఫలితం ఏమిటో రామోజీరావుకు తెలియాలి.
ప్రస్తుతం ఆంధ్ర, కేసీపీ షుగర్స్లో ఒక్కొక్క యూనిట్, శ్రీకాకుళంలోని ఈఐబీ ప్యారీ, చిత్తూరులోని ఎస్ఎన్జే షుగర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. బాబు విధానాల వల్ల క్రషింగ్ సామర్థ్యం 45 లక్షల టన్నుల నుంచి 19 లక్షల టన్నులకు పడిపోయింది. కాగా చెరుకు సాగు చేసే వారికి ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తోంది. పంట నష్ట పరిహారంతోపాటు సున్నా వడ్డీ రాయితీ, పైసా భారం పడకుండా పంటల బీమా అమలు చేస్తోంది. రూ.2 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఈనాడు వాదిస్తోంది. కానీ ఇది నిజం కాదు. మూత పడిన చక్కెర కర్మాగారాల వ్యవహారంపై కోర్టులో స్టే ఉన్న వారికి తెలియంది కాదు. కానీ బురద వేసేందుకు రాసిపారేశారు.
అసలు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సంస్థల విక్రయంలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. నిజాం షుగర్స్ మార్కెట్ విలువ రూ.120 అయితే రూ.55 కోట్ల తెగనమ్మారు. మధురానగర్ షుగర్ మిల్ విలువ రూ.40 కోట్లయితే రూ.22.50 కోట్లకు, లచ్చయ్యపేట షుగర్ మిల్ విలువ రూ.40 ఉండగా రూ.21.45 కోట్లకు, హనుమన్ జంక్షన్ షుగర్స్ విలువ రూ.30 కోట్లయితే రూ.11.4 కోట్లకు, నంద్యాల షుగర్స్ వ్యాల్యూ రూ.20 కోట్లు ఉండగా రూ.6.01 కోట్లకు, పాలకొల్లు షుగర్స్ విలువ రూ.10 కోట్లయితే రూ.3.3 కోట్లకు, గురజాల షుగర్స్ విలువ రూ.14 కోట్లయితే రూ.5.27 కోట్లకు, హిందూపురం షుగర్స్ విలువ రూ.20 కోట్లయితే రూ.8 కోట్లకు విక్రయించిన పాపం బాబుదే. టీడీపీ హయాంలో కర్మాగారాలు మూతపడి ఎందరో చెరుకు రైతులు కుదేలైపోయారు. వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ విషయాలన్నీ రామోజీకి తెలుసు. కానీ జగన్పై ద్వేషంతో విషపు రాతలు రాయిస్తున్నారు.