యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడే కుల గ్రూప్ లు నడిపుతూ రాజకీయాలు చేసిన బాబు, 1977 లో స్థానిక యువజన కాంగ్రెస్ నాయకుడిగా గల్లా అరుణకుమారి తండ్రి అయిన పాతూరి రాజగోపాల నాయుడు యొక్క సిఫారసు మేరకు చంద్రగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందాడు. రాజకీయ అనిశ్చితి కారణంగా అడిగిన వారందరికీ మంత్రి పదవులు ఇవ్వాల్సి రావడంతో రాజగోపాల నాయుడు యొక్క బలమైన సిఫారసు మేరకు T.అంజయ్య క్యాబినెట్ లో సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితుడయినాడు. సినిమాటోగ్రఫీ మంత్రి అయితే సినిమా షూటింగ్ లకి వెళ్లి కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ ఎన్టీఆర్ దృష్టిలో పడటానికి ఆయన షూటింగ్ లు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి కూర్చునే వాడు.. అలా ఎన్టీఆర్ కంట పడి ఆ పరిచయం పిల్లనిచ్చే వరకు వెళ్లింది.. మంత్రిగా ఉన్నప్పుడే భువనేశ్వరి తో వివాహం జరిగింది.
1982 లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు పార్టీ ఆదేశిస్తే ఎన్టీఆర్ మీదే పోటీ చేస్తా అని ప్రగల్భాలు పలికాడు, 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మీద ఓడిపోయి నెల తిరక్కుండానే గర్భవతిగా ఉన్న భార్యను అడ్డం పెట్టుకుని రాయబారం నడిపాడు. టీడీపీ లో ప్రతీ నాయకుడు బాబుని పార్టీ లోకి రానివ్వవద్దని ఎంత వ్యతిరేకించినా కూతురి మీద ఉన్న ప్రేమతో ఎన్టీఆర్ పార్టీ లోకి రానిచ్చాడు.
1989 లో కుప్పం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. 1994 లో మరోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగా చంద్రబాబు మంత్రిపదవి పొందాడు. ఏడాది తిరక్కుండానే ఎన్టీఆర్ ని గద్దెదింపి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు.
అప్పటికే దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉండగా కేంద్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుండగా ఎన్టీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరాడు. భారత దేశం పార్టీ అనే పేరుతో పార్టీ పేరును కూడా ప్రకటించాడు కానీ ఆలోపే బాబు పోటుకు గురయ్యాడు. ఎన్టీఆర్ ఆరాటాన్ని చంద్రబాబు కూడా కొనసాగిస్తూ జాతీయ రాజకీయాల్లో ఆసక్తి చూపించడంతో సుర్జీత్ సింగ్ బర్నాల సాయంతో నేషనల్ ఫ్రంట్ లో భాగస్వామి అయ్యాడు. మేము కాంగ్రెస్ కు ఎంత దూరమో బీజేపీ కి కూడా అంతే దూరం అని ప్రకటించి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి అండగా నిలిచాడు, దానికి కన్వీనర్ గా కూడా వ్యవహరించాడు.
1998 వ సంవత్సరం – 12వ లోక్ సభ ఎన్నికల ముందు యునైటెడ్ ఫ్రెంట్ కన్వీనర్ హోదాలో బీజేపిని మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించి ఎన్నికలు అయిన వెంటనే రాత్రికి రాత్రే కామ్రేడ్లకి, ఫ్రెంట్ సభ్యులకి కలిపి వెన్నుపోటు పొడిచి తన 12 మంది సభ్యులచేత చేత బీజేపికి ఓటు వేయించాడు. దళితులు, మైనారిటీలు తీవ్రంగా వ్యతిరేకించే మతతత్వ బీజేపీకి చీకట్లో షేక్ హ్యాడ్ ఇచ్చినందుకు రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న దళితులు ఎక్కడ టీడీపీకీ చీ కొడతారో అనే భయంతో దళిత వ్యక్తి అయిన బాలయొగి గారికి స్పీకర్ ఇప్పించి దళిత ఉద్దారకుడి ఫోజులు కొట్టాడు.
సుర్జీత్ సింగ్ ఆ సమయం లో బాబుని తిట్టిన తిట్లు వేరే ఎవరిని తిట్టినా ఆత్మహత్య చేసుకునేవారు. కానీ బాబుకు సిగ్గు, మనం అనేవి ఏం ఉండవ్ కాబట్టి తుడుచుకుని పక్కకి వెళ్లాడు..
1999 ఎన్నికల్లో కార్గిల్ యుద్ధ ప్రభావం వలన బిజెపి కి మంచి పేరు రావడంతో వారితో కలిసి ఎన్నికలకి వెళితే తనకు లాభం అని బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకి వెళ్లి మొదటిసారి ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాడు..
ఇక 2002 గోద్రా అల్లర్ల కారణంగా దేశవ్యాప్తంగా ముస్లింలు బిజెపి పై ఆగ్రహంతో ఉండటంతో మోదీ హైదరాబాద్ వస్తే ఉరి తీస్తా అని ప్రకటించి, 2004 ఎన్నికల్లో మళ్లీ బీజేపీ తోనే పొత్తు పెట్టుకున్నాడు, అలిపిరి ఘటన తర్వాత ప్రజల్లో తనకి సింపతీ వస్తుంది అనుకుని కేంద్రంలో కూడా ముందస్తు ఎన్నికలకు బీజేపీ ని ఒప్పించి ఇక్కడా, కేంద్రంలో రెండు చోట్ల బొక్కబోర్లా పడ్డాడు…
ఇక 2009 ఎన్నికల నాటికి వైయస్సార్ హవా గట్టిగా ఉండటం, ప్రజలందరూ వైయస్సార్ వెనుక ఉండటంతో మళ్లీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక తెరాసతో, కమ్యూనిస్ట్ లతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లగా మళ్లీ బొక్క బోర్లా పడ్డాడు.
ఇక 2014 ఎన్నికలు తనకు, టీడీపీ కి తాడో పేడో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వీహెచ్పీ ద్వారా రాయబారం నడిపి బీజేపీ తో పొత్తుకు ఒప్పించి మోడీ హవా లో, రుణమాఫీ అనే అబద్ధపు హామీతో కేవలం 1% ఓటు షేర్ తేడాతో గెలుపొంది కేంద్రంలో కూడా క్యాబినెట్ పదవి కూడా తీసుకున్నాడు.
2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి కేంద్రం ఇచ్చీన డబ్బుకు లెక్కలు చెప్పకుండా మోసాల మోదీ అన్నాడు, బీజేపీకి సహకరించేవాళ్ళు దేశ ద్రోహులు అన్నాడు, మోదీ హటావో అన్నాడు, దేశాన్ని ఏకం చేస్తా మోడీనీ దించేస్తా అన్నారు, మోదీకి భార్యను చూసుకోవడమే రాదు ఇక ప్రజలని ఏం చూసుకుంటాడని, మోడీ తో కలిసినందుకు మైనారిటీలకు క్షమాపణ చెప్తున్నా అన్నాడు…
తీరా ఎన్నికలు అయ్యాక ఓటమి రుచి మరొకసారి చూసి మోదీ మరోసారి పీఎం అవ్వడంతో బీజేపీ కి నా పూర్తి మద్దతు అనీ, మోదీ దేశానికి అవసరం అనీ, మోదీ గొప్ప నాయకుడు అనీ, అడిగినదానికి అడగనిదానికి పార్లమెంట్ లో పూర్తిగా మద్దతు ఇస్తూ, తన రాజ్యసభ సభ్యులను కూడా బీజేపీ లో పంపి తొలినాటి నుండీ బీజేపీ కి మళ్లీ దగ్గర అవ్వడానికి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు, పవన్ కల్యాణ్ ను బీజేపీ కి దగ్గర చేసి తన ద్వారా బీజేపీ తో టీడీపీ కి సయోధ్య కుదర్చాలని ఎన్నో విదాలుగా ప్రయత్నాలు చేసినా బాబు నైజం తెల్సిన బీజేపీ తనని దూరం పెడుతూనే ఉంది..
ఇప్పుడు కాళ్లా వేళ్లా పడి ఎలాగోలా ఒప్పించి బిజెపి అన్ని షరతులకు తలొగ్గి మరోసారి 2024 ఎన్నికల్లో బీజేపీ తో కలిసి ఎన్నికలకు వెళ్లనున్నాడు…
నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర అని, రాజకీయ చాణుక్యున్ని అని డబ్బా కొట్టుకునే బాబు ఒక్కటంటే ఒక్క ఎన్నికలో కూడా ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర లేదు 2019 లో కూడా ఒంటరిగా పోటీ చేసినట్లు కనిపిస్తున్నా తెరవెనుక జనసేన తో పూర్తి లోపాయికారి ఒప్పందం తో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ఉద్దేశంతో నే వేరుగా పోటీ చేశారు గానీ అదీ ఒకరకమైన పొత్తే…
ముందు నేషనల్ ఫ్రంట్, కమ్యూనిస్ట్ లు, తర్వాత బిజెపి, తర్వాత తెరాస, కమ్యూనిస్ట్ లు, జనసేన,మళ్లీ బీజేపీ, మళ్లీ జనసేనతో లోపాయికారీ ఒప్పందం, ఇప్పుడు మళ్లీ జనసేన- బీజేపీ.. ఇలా మార్చి మార్చి అన్ని రకాల పార్టీలతో ఆఖరికి టీడీపీ పెట్టింది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అని చెప్పుకుని 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కూడా పొత్తు కుదుర్చుకున్నాడు…
దేశంలో మరే ఇతర నాయకుడు ఇన్ని రకాల ప్లేట్లు ఫిరాయించినట్లు చరిత్రే లేదు. ఒక సిద్ధాంతం లేదు, ఒక భావజాలం లేదు, ఒక కమిట్మెంట్ లేదు ఎప్పుడు అధికారంలోకి రావాలి అనే యావ తప్ప 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకంటూ ఓ క్రెడిబిలిటీ లేకుండా జీవిత చరమాంకం లో కూడా ఇలా పొత్తు(పొద్దు) తిరుగుడు పూవులా పొత్తుల వైపు తిరుగుతూనే ఉన్నాడు. ఎప్పుడు ఏ జెండా పట్టుకుని ఎవరికి జై అనాలో కూడా తెలియని పరిస్థితి కి టీడీపీ కార్యకర్తలకు కల్పించి వారిని కూడా మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాడు…