చంద్రబాబు అధికారంలోకి రాకముందు రాష్ట్రం లో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే ఆ జిల్లా కలెక్టర్ జీవితం సెట్ అవుతుందనే సామెత ఉండేది. బాబు సీఎం అయ్యాక, తుఫాన్, వరద వస్తే బాబుకి పండగే అనే సామెత పుట్టుకొచ్చింది..
1997 లో గోదావరి జిల్లాల్లో ఓ పెను తుఫాన్ సంభవించింది. ఇక సంక్షోభం లో అవకాశం వెతుక్కునే చంద్రబాబు రంగలోకి దిగాడు.. తుఫాన్ భాదితుల సంక్షేమాన్ని వదిలేసి గుజారత్, మహారాష్ట్ర అంటూ దేశం అంతా తిరిగి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులను కలిసి చందాలు వసూలు చేసివ్వమని కోరాడు… ఆ విరాళాలను ఖర్చు పెట్టడానికి ప్రభుత్వ అధికారులు కాకుండా అనధికారులు అయిన తన అనుయాయులతో కమిటీ లు వేసి వాటి ద్వారా ఖర్చు చేసే ప్రణాళిక సిద్ధం చేశాడు..
చనిపోయిన ప్రతీ వ్యక్తి కుటుంబానికి లక్ష చొప్పున ఇస్తా అని ప్రకటించి బతికే ఉన్న వారిని చనిపోయినట్లు గా, అసలు భూమ్మీదే లేని వ్యక్తులను సృష్టించి వారు కూడా చనిపోయినట్లుగా రికార్డులు మార్చి లక్ష చొప్పున వారి తరపున నష్ట పరిహారాన్ని తను, తన వాళ్లే కాజేశారు… నిజంగా మృత్యువాత పడ్డవారి కుటుంబాలకి చివరకు దక్కింది 15 వేలే…
ఇక గల్లంతు అయిన మత్స్యకారుల కుటుంబాలకు అయిదువేల చొప్పున ప్రకటించి, ఊర్లోనే ఉన్న వారిని కూడా గల్లంతు అయినట్లుగా చిత్రించి ఒక్కొక్కరి దగ్గర 2 వేలు లంచంగా పుచ్చుకున్నారు. ఇలా బినామీ పేర్లతో నిధుల స్వాహా చేసినట్లు ఆనాటి పత్రికలు కోడై కూశాయి….
ఇవన్నీ చూసి ప్రజలు బాబు ని ఎక్కడిక్కడ నిలదీయగా అధికారులు మీద చర్యలు తీసుకుంటా అని చెప్పి, ” సిగ్గుతో తలదించుకుంటున్న” అని భాద్యులైన వారి మీద ఎలాంటి చర్య తీసుకోకుండా నిజయితీ గల వ్యక్తిగా పేరున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ ను బదిలీ చేశాడు…
అదేంటో తుఫాన్ లు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే, బాబు మాత్రం సంబరాలు చేసుకుంటుంటాడు.. హుదూద్ తుఫాన్ సంభవించినప్పుడు కూడా ఇదే తీరుగా ప్రవర్తించాడు బాబు.. వారలో హుదూద్ ని తరిమి కొట్టా, చెట్లు నరికా, కరెంట్ స్తంభాలు నిలబెట్టా అంటూ అధికారులను తమపని తాము చేసుకోనివ్వకుండా అంతా తానే చేస్తున్నట్టు ఆర్భాటం చేశాడు.. ఊరి మొత్తానికి 500 రూపాయలు ఇచ్చి కూరగాయలు కొనుక్కోమన్నాడు… కేంద్రం ఇచ్చిన నష్టపరిహారాన్ని లబ్ధిదారులకు చేరనీయకుండా బినామీల పేర్లతో స్వాహా చేశాడు… దానికి మించిన గొప్ప కార్యం ఏంటంటే… తుఫాన్ వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడి అప్పుడప్పుడే కోలుకుంటుంటే వింతగా వెంకయ్య నాయుడు తో కలిసి హుదూద్ తుఫాన్ సంబరాలు నిర్వహించాడు…
ఏది ఏమైనా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవాలి అనే విషయాన్ని చంద్రబాబు అర్థం చేసుకున్నట్లు గా మరెవరు అర్థం చేసుకోలేరు కాబోలు…