కాదేదీ దోపిడీకనర్హం… అందునా దేవుడి సొమ్మైతే మనదే అన్నట్టు… ఇది బాబు వరస…వివరాల్లోకి వెళితే..
కారంపూడి లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి దాదాపు 2700 ఎకరాలు దేవుడి మాన్యం ఉంది. అందులో దాదాపు 700 ఎకరాలు రైతులు కౌలుకు చేస్తుండగా మిగిలిన 2000 ఎకరాలను శ్రీ చక్ర సిమెంట్ (గోల్డ్ స్టార్) కు అక్రమంగా ధారాదత్తం చేసాడు బాబు. ఈ గోల్డ్ స్టార్ సిమెంట్ లేదా శ్రీ చక్ర సిమెంట్ ఓనర్ అయినా పార్థసారది బాబుకు సన్నిహితుడు కావడం చేత, 2000 ఎకరాల దేవుడి మాన్యం లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోండా ఉన్నారు.. ఒక పక్క రైతులు కౌలు చెల్లించక, మరో పక్క ఈ సిమెంట్ కంపెనీ దోపిడీ కారణం గా నిత్యం ధూప దీప నైవేద్యాలతో సుందరంగా ముస్తాబయి వందల ఏళ్లపాటు పూజలు అందుకున్న స్వామివారు, రూపాయి ఆదాయం లేక పాడుబడ్డ గోడల మధ్య బంధీ అయ్యాడు అని ఆనాడు పత్రికలు ఘోషించాయి..
అధికారంలో ఉంటే ఆయన దోపిడీకి అడ్డు చెప్పేవాడు ఉండడు, ఎవరైనా అడ్డు చెప్పితే వారిని ఉండనివ్వడు, తన అవినీతిని ప్రశ్నించిన వారిపై తిరిగి ఆయనే అవినీతి ముద్ర వేస్తాడు.
నేను మారిపోయా ఈ ఒక్కసారి నమ్మండి అని అడుక్కుని అధికారంలోకి వచ్చిన బాబు 2014-19 మధ్య కూడా విచ్చల విడిగా రాష్ట్ర ఖనిజ సంపదను, గనులను దోచుకున్నాడు, ఇసుక మాఫియా ద్వారా వేల కోట్లు కూడబెట్టి రాష్ట్రఖజానాకు గండి గొట్టాడు. తన అత్యంత సన్నిహితుడు అయిన యరపతినేని శ్రీనివాస్ రావు పల్నాడు ప్రాంతంలో 17 సున్నపు రాయి గనులను అక్రమంగా దోచేసి 1500 కోట్లకు పైగా అవినీతి చేశాడని సీబీఐ కేసు నమోదు చేసింది. ఇలా ఒకటేమిటి తను సీఎం అయితే రాష్ట్రంలో ఉన్న చిన్న రాయి ముక్క అయినా తన సొంత సొమ్మే అని భావించి విచ్చలవిడిగా దోచేస్తాడు…