వెనుకబడిన ప్రాంతం అయిన ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నా, 100 కోట్లు అయినా,150 కోట్లు అయినా ఖర్చు చేసేలా వచ్చే బడ్జెట్ లో వాటిని కేటాయించి మొదటి దశ పనులు పూర్తి చేస్తామని, తక్షణమే 25 కోట్లు మంజూరూ చేస్తున్నామని, 1995 మార్చ్ 5 న శంకుస్థాపన చేస్తూ ప్రగల్భాలు పలికిన బాబు తర్వాత 8 ఏళ్లు అధికారంలో ఉన్నా ఒక్క రూపాయి కూడా వెలిగొండ కొరకు బడ్జెట్ కేటాయించింది లేదు, రూపాయి పనులు చేసిందీ లేదు. 2004 లో అధికార పీఠం నుండి దిగిపోయేవరకు ఒక చిన్న గుంత కూడా తీయకుండా ప్రాజెక్టు ను అలాగే వదిలేశాడు… 8 ఏళ్లలో కనీసం తట్ట మట్టి తీసిన పాపాన పోలేదు.
వైయస్సార్ సీఎం అయ్యాక 2005 లో పనులు ప్రారంభం కాగా ఆయన దివంగతుడు అయ్యేనాటికి 880 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 11.5 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకాలు పూర్తి అయ్యాయి…
ఇక 2014 లో ముఖ్యమంత్రి అయిన బాబు తన ఐదేళ్ల పాలనలో 420 కోట్ల ఖర్చుతో కేవలం కిలోమీటర్ల టన్నెల్ మాత్రమే పూర్తి చేశాడు. అంటే తన 14 ఏళ్ల ముఖ్యమంత్రి హోదాలో బాబు పూర్తి చేసింది కేవలం 6.5 కిలోమీటర్లే.. అందునా చేసిన ఖర్చు పై చెప్పిన లెక్కలు కూడా తప్పులు తడకగా ఉన్నాయని కాగ్ తో చివాట్లు తిన్నాడు..
చేసిన అదే అతి కాస్త పని 1996-2004 మధ్య చేసి ఉంటే వెలిగొండ ప్రాజెక్ట్ 2014 లోగానే పూర్తి అయ్యేది ఆ ప్రాంతవాసులకు ఈ పదేళ్లలో నీరు అంది పదేళ్ళ వ్యవసాయ ఆదాయం పెరిగి ఉండేది. ఒక ప్రాంతం యొక్క కలని, వారి అవసరాన్ని? వ్యవసాయాన్ని పదేళ్లపాటు వెనక్కి నెట్టిన ఘనుడు బాబు..
జగన్ తన 4 ఏళ్ల పాలనలోనే 10.5 కిలోమీటర్ల టన్నెల్ నీ 710 కోట్లతో పూర్తి చేసి ఆ ప్రాంత వాసుల చిరకాల కోరికను నెరవేర్చాడు… 10.5 కాదు ఇంకో పాతిక కిలోమీటర్లు ఉన్నా శరవేగంగా జగన్ ఆ పనిని ఈ టర్మ్ లోనే పూర్తి చేసి ఉండేవాడు.. చేతకాని వాగ్దానాలు, అవగాహన లేని పనులు, చిత్తశుద్ధి లేని కార్యక్రమాలు మాత్రమే అలవాటైన బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెడతాడు…