తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హస్తిన బాట పట్టారు. మీ కూటమిలో చేరుతాను మహాప్రభో అంటూ గత నెలలో కేంద్ర మంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలిసిన విషయం తెలిసిందే. అయినా ఇంత వరకు సమాధానం రాకపోవడవంతో వారితో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరగా ఏ విషయమో చెప్పాలని చాలారోజులుగా నారా వారు బతిమిలాడుకుంటున్నారు. బాబు ఢిల్లీ టూర్పై విజయవాడ ఎంపీ కేశినాని నాని స్పందించారు.
అసలు ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు ఎందుకు బయటకు వచ్చారని.. మళ్లీ ఎందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలని చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పట్లో ఆత్మ గౌరవ దీక్షల పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీని వ్యక్తిగతంగా తిట్టారు. ప్రభుత్వ ఖాజానాతో ప్రత్యేక విమానంలో రాష్ట్రాలు తిరిగారు. కూటమి కట్టాలని ప్రయత్నించారు. 2018లో బాబు చెప్పడంతో తానే ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టానని నాని వెల్లడించారు. ఆ సమయంలో పార్లమెంట్లో ఎంపీలు ఏం మాట్లాడాలనేది ఆయనే చెప్పారు.. ముందు స్పెషల్ ప్యాకేజీ ముద్దని సంబరాలు చేసుకుని.. తర్వాత స్పెషల్ స్టేటస్ కావాలంటూ మాట మార్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని భావించి కాంగ్రెస్తో జత కట్టారు. లోకేశ్ను ముఖ్యమంత్రి చేసి తాను ప్రధాని కావాలని బాబు తీవ్రంగా ప్రయత్నించారు. ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ మళ్లీ ఎన్డీఏ కూటమి గెలవడంతో మోదీ, అమిత్షా మెప్పు కోసం భజన మొదలు పెట్టారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వారి కూటమిలో చేరాలని చూస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కడంలో చంద్రబాబు సిద్ధ హస్తుడు. ఆయన్ను ప్రజలు నమ్మడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం. వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు.