టిడిపి జనసేన బిజెపి పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో కీలక ఘట్టం సీట్లు పంపకాలు కూడా జరిగిపోయాయి. 175 అసెంబ్లీ స్థానాలు గాను టిడిపి 144, జనసేన 21, బిజెపి 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. చంద్రబాబు అపర చాణిక్యత ఇక్కడ చూపెట్టడం మొదలుపెట్టాడు. టిడిపికి బాగా పట్టు ఉన్న, నాయకులు ఉన్న స్థానాలను చంద్రబాబు తీసుకొని, ఎక్కడైతే టిడిపి వారికి అభ్యర్థులు లేకుండా, పక్కా ఓడిపోతాం అనుకునే 10 సీట్లను బిజెపి వారికి కేటాయించారు. టిడిపి బలహీనంగా ఉన్న 21 స్థానాలను జనసేనకి కేటాయించాడు. జనసేన, బీజేపీలు మాత్రం ఇదే మహా ప్రసాదంలా భావించి కళ్ళకద్దుకొని ఈ సీట్లని తీసుకున్నారు. అయితే జనసేన నుంచి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా అసలు సమస్య ఇప్పుడు నిజమైన బిజెపికి, చంద్రబాబు బిజెపికి సమస్యలు వచ్చాయి.
ఇప్పుడు బిజెపికి కేటాయించిన సీట్లు టిడిపి గత నాలుగు ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లే, ఆ సీట్లకి చంద్రబాబు బిజెపి ఓకే అంటున్న నిజమైన బిజెపి నాయకులకి అది అంతు పట్టడం లేదు. ఆ సీట్ల విషయానికి వస్తే కడప జిల్లాలోని బద్వేలు, జమ్మలమడుగు సీట్లు బిజెపికి కేటాయించారు. ఆ సీట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనివి, అక్కడ బిజెపి గెలిచే అవకాశమే లేదు. విజయవాడ పశ్చిమ పరిస్థితి కూడా అలాంటిదే 1983లో తెలుగుదేశం పెట్టిన తొలి ఎన్నికల్లో ఆ సీట్లో విజయం సాధించింది ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా అక్కడ టిడిపి విజయం సాధించలేక పోయింది అటువంటి సీట్ ను కూడా బీజేపీకి కేటాయించారు.ఇలా ఓడిపోయే సీట్లు బీజేపీకి కేటాయించడం ఏంటని నిజమైన బిజెపి నాయకులు మండిపడుతున్నారు. ఈ విషయమై చర్చించేందుకు ఇప్పటికే కేంద్ర బిజెపి పెద్దలకు లేఖలు రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి సీట్లలో పోటీ చేయలేమని 2014 ఎన్నికలలో బిజెపి ఎక్కడైతే బలం నిరూపించుకొందో ఆ సీట్లు కేటాయించాలని అదేవిధంగా బిజెపి కోసం కష్టపడిన నాయకులకే సీట్లు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. జంపింగ్ లకు తావు ఇవ్వకూడదని బిజెపి స్థానిక నాయకులు అధినాయకత్వాన్ని కోరుతున్నారు.