2014లో నవ్యాంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు పశ్చిమగోదావరి జిల్లాకు కూడా ఎన్నో హామీలను ఇచ్చాడు. కానీ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలం గడిపేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కసారి పరిశీలిస్తే..
– నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
– ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్
– నరసాపూర్ పోర్టు
– తాడేపల్లి గూడెం విమానాశ్రయము
– సిరామిక్ పరిశ్రమ
– ఆయిల్పామ్ పరిశ్రమ
– పర్యాటక కేంద్రంగా కొల్లేరు సరస్సు
– జలమార్గాల అభివృద్ధి
– చింతలపూడి ప్రాంతంలో బొగ్గు వెలికితీత
– పోలవరం ప్రాజెక్టు
– కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమలు
– మెట్ట ప్రాంతాల్లో 100 శాతం డ్రిప్ ఇరిగేషన్
– ఆక్వాకల్చర్ మరియు ప్రాసెసింగ్ యూనిట్
– ఉద్యానవన పరిశోధనా కేంద్రం
జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్ ని కేంద్రం బాబు అధికారంలోకి రాక మునుపే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రపోజల్ పెట్టింది. కానీ 2015 లో శంకుస్థాపనకు నోచుకోగా పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి మాత్రం ఐదేళ్లు పట్టినా 2020 జనవరి 1 పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ ఏర్పాటు కోసం చంద్రబాబు కనీసం ప్రయత్నం చేయకపోగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థన కూడా చేయలేదు.
చంద్రబాబు తన 14 సంవత్సరాల పాలనలో ఒక పోర్ట్ కట్టిన చరిత్ర లేదు. నర్సాపూర్ పోర్ట్ పేపర్ ప్రకటనకే పరిమితం చేసాడు బాబు. తాడేపల్లిగూడెంకి ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన బాబు, ఉన్న పాత ఎయిర్ స్ట్రిప్ ను కూడా అభివృద్ధి చేయకపోవడం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధంలో తాడేపల్లి గూడెం ఎయిర్ స్ట్రిప్ చాలా ప్రాచుర్యంలో ఉండేది. క్రమేపి వాడకం తగ్గిపోవడం వలన అది చరిత్ర పుటల్లో చేరింది.
సిరామిక్ పరిశ్రమ, ఆయిల్ఫామ్ పరిశ్రమల ఏర్పాటు హామీనిచ్చిన బాబు అనంతరం ఆ హామీని గాలికి వదిలేసాడు. పర్యాటక కేంద్రంగా కొల్లేరు సరస్సును అభివృద్ధి చేస్తానని 2015 అసెంబ్లీలో తీర్మానం చేసాడు. కానీ అంతకముందే దివంగత నేత వైస్సార్ అసెంబ్లీలో కొల్లేరు అభివృద్ధికి తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తర్వాత అకాల మరణం చెందారు. ఆ సంఘంటన వల్ల కొల్లేరు అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఒకసారి తీర్మానం జరిగిన తరువాత మళ్ళీ తీర్మానం చేయడం చంద్రబాబుకే చెల్లింది. అదీ తీర్మానంతోనే సరిపెట్టాడు కానీ అభివృద్ధి చేయలేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు సరస్సు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుగుతున్నాయి.
చింతలపూడి ప్రాంతంలో బొగ్గు వెలికితీత మాటలుతోనే సరిపెట్టేసాడు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్ గురుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆనాడు కేంద్రతో పొత్తులో ఉన్న బాబు ఒక జాతీయ ప్రాజెక్ట్ ను తీసుకొని వచ్చి రాష్ట్రమే కట్టుకుంటుందని చెప్పి పోలవరంను ఒక ఎటిఎం లాగ వాడుకున్నాడని ప్రధాని నరేంద్ర మోడీనే వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం కలిగించింది. పోలవరం ప్రాజెక్టును ఏటీఎం మెషిన్ లా వాడిన ఘనత చంద్రబాబుకే చెల్లింది . కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమలు, మెట్ట ప్రాంతాల్లో 100 శాతం డ్రిప్ ఇరిగేషన్,ఆక్వాకల్చర్ మరియు ప్రాసెసింగ్ యూనిట్, ఉద్యానవన పరిశోధనా కేంద్రం ఇలా లెక్కలేనన్ని హామీలు ఇవ్వడం, ఆ మాటలు నమ్మిన ప్రజలను మోసంచేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిపోయింది