జనసేన పార్టీలో అంతర్గత కుమ్ములాట, వీర మహిళలు పై దాడి జరుగుతున్న వేళ సేనాని నుంచి స్పందన కరువైంది. మొన్న జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేశారు, ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడు అని ప్రకటించాక పిఠాపురం నియోజక వర్గ స్థాయిలో సమీక్ష జరిగితే నియోజక వర్గ ఇంఛార్జి శేషు కుమారికి ఆహ్వానం లేదు, 2019 ఎన్నికలలో ఈమె పోటీ చేసింది. నిన్న విశాఖ దక్షిణ నియోజక వర్గంలో కార్పొరేటర్ సాధిక్, వంశీ యాదవ్ వర్గీయులు మధ్య గొడవలో వంశీ వర్గీయులు మహిళలపైన దాడులకు పాల్పడ్డారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం లో కార్పొరేటర్ సాదిక్ వర్గానికి, వంశీ వర్గానికి తారస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో వంశీ యాదవ్ వైసీపీ పార్టీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరుతున్న సమయంలో వంశీకి పవన్ కళ్యాణ్ టికెట్ హామీ ఇచ్చాడు. మొదట భీమిలీ లో పోటీ చేయాలని భావించినా అక్కడ పోటీ చేయకుండా విశాఖ దక్షిణంలో పోటీ చేయాలి అని నిర్ణయించుకుని తన వర్గాన్ని ఇక్కడ దింపి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అదే నియోజక వర్గం నుంచి కార్పొరేటర్ సాదిక్ కూడా పోటీ చేయాలని భావించాడు. వంశీ కృష్ణ అడ్డు తగలడంతో ఆధిపత్య బలం చూపించుకోవడానికి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. నిన్ను సాదిక్ వర్గంలోనే మహిళల పైన వంశీ కృష్ణ యాదవ్ అనుచరులు దాడి చేయగా, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నుంచి గాని ఇతర నాయకుల నుంచి ఈ సంఘటన పైన స్పందన లేదు. ఇలా వీర మహిళలపై వరుస దాడులు జరుగుతున్న పవన్ కళ్యాణ్ మౌనం దేనికి అంగీకారం.