నాడు జీతాలు, నిధులు ఇవ్వకుండా పదుల కాలేజీలు మూసివేసిన బాబు. నేడు జాతీయ స్థాయి గుర్తింపు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(NBA ) గుర్తింపు సాధనలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తూ గణనీయమైన ప్లేస్మెంట్లు నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే NBA సర్టిఫికేషన్ ఒకేసారి ఇన్ని కాలేజీలకు దక్కడంపై… వాటిలో పని చేసే ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం, శ్రీశైలం, తిరుపతి, పిల్లరిపట్టు,శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, జమ్మలమడుగు, కదిరి, నందిగామ, పలమనేరు, కడవ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు మదనపల్లె మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీకి కూడా ఎన్బీఏ సర్జీఫికేషన్ దక్కింది.
సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్నామనీ, అందువల్లే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు అత్యంత ప్రతిష్టాత్మక ఎనిన్డీఏ సర్టిఫికేషన్ దక్కుతోందనీ, భవిష్యత్లో ప్రతి కాలేజూ ఎన్డీఏ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామనీ. ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కరిక్యులమ్లో మార్పులు తెచ్చామనీ, ఉద్యోగ అవకాశాలు పెంచేలా 674 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నామనీ, గత విద్యా సంవత్సరంలో 7 వేల మంది చదువులు పూర్తి చేసుకుంటే 4 వేల మందికి పైగా ప్లేస్మెంట్లు సాధించారనీ, పది శాతం గా ఉన్న ప్లేస్మెంట్లను 60 శాతానికి తీసుకువచ్చామనీ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ఈ సంధర్భంగా తెలిపారు.
రాష్ట్రంలో ఇంతకు ముందు చాలా ఎక్కువగా అందుబాటులో పాలిటెక్నిక్ కాలేజీలు ఉండేవి. పది మంచి మార్కులతో పాసైన పిల్లలు, వెంటనే సాంకేతిక విద్యను అభ్యసించిడానికి పాలిటెక్నిక్ కోర్సులు ఉపయోగకరంగా ఉండేవి. అయితే బాబు హయాంలో ఒకేసారి 60 పాలిటెక్నిక్ కాలేజీలను మూసివేయడంతో… ఆ శూన్యతను భర్తీ చేసి ఉన్నత స్థితికి రావడానికి దశాబ్దాల కాలం పట్టింది.
నాడు బాబు హయాంలో పాలిటెక్నిక్ కాలేజీలు అభివృద్ధికై విడుదల చేసిన నిధుల్లో అవకతవకలున్నాయని సాకు చూపుతూ … వాటిని ఉపాధ్యాయులకు ముడిపెట్టి, వారి జీతాల పెంపును ఆపేందుకు అప్పటి ముఖ్యమంత్రి బాబు పథకం రచించారు. వందల కొద్దీ ఉపాధ్యాయులు వేలాదిగా విద్యార్థులు హైదరాబాద్ వెళ్ళి వారి నిరసన తెలియజేసి, గోడు బాబుకి వినిపించినా కనికరిoచకపోవడంతో… ఒకే సారి ఉపాధ్యాయుల కొరత ఏర్పడి, సుమారు 60 పాలిటెక్నిక్ కళాశాలలు ఒక్కసారిగా మూత పడ్డాయి. దానితో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోవడం జరిగింది. మళ్ళీ ఇన్నాళ్టికి జగన్ ప్రభుత్వంలో పాలిటెక్నిక్ కళాశాలలు పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయి.