ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన మూడు డిఏలలో, రెండు డిఏలను ప్రకటిస్తూ జీవోని విడుదల చేసింది. రెండు విడతల డిఏను 3.64 శాతం చొప్పున పెరుగుదలతో మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు డిఏలు 26.39 శాతం ఉంది. ఈ పెంపుదలతో 33.67 శాతంకు పెరుగుతుంది.ఇందులో ప్రస్తుతం ఒక డిఏను మార్చి నెల జీతంతో కలిపి ఏప్రిల్ లో చెల్లించనున్నారు. ఈ డిఏకు సంబంధించిన బకాయిలను మూడు విడతలగా చెల్లిస్తామని అది ఏడాది ఆగస్టు, నవంబర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల జీతంతో కలిపి చెల్లించునున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. 2023 జనవరి 1 నుంచి ఈ డిఏ అమలు అవుతుంది.
ఇంకో డిఏని జూలై ఒకటి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 2023 జూలై 1వ తేదీ నుంచి 2024 జూన్ 30 వరకు ఉన్న బకాయిలను కూడా మూడు విడతలుగా చెల్లించనున్నారు. ఏడాది జూలై నెల జీతం పెరగడంతో పాటు బకాయిలను కూడా ఈ ఏడాది సెప్టెంబర్ డిసెంబర్ వచ్చేయడాది మార్చిన జమవుతాయని ప్రభుత్వం తెలిపింది. డిఎల్ తో పాటుగా పిఆర్సి అంశం పైన కూడా చర్చలు జరుగుతున్నట్లు ఇప్పటికే పిఆర్సికి సంబంధించిన కమిటీ పని చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.