ఏపీకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ సీట్లకు 25 లోకసభ స్థానాలకి ఒకే విడతలు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనుండగా, ఏపీలో ఎన్నికలు నాలుగో విడతలో నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించినట్లు, జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుందని సీఈసీ తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ వివరాల కొరకు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ వివరాలు వెల్లడించింది,
షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికలకు అమల్లోకి వచ్చింది.
ఏపీలో ఎన్నికల సరళి ఈ విధంగా ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతాయి, జూన్ 4వ తేదీన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికలు కూడా కూడా మే 13న జరుగుతుంది అని, పార్లమెంట్ తో పాటుగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత స్థానం ఖాళీ ఏర్పడడంతో దానికి సంబంధించిన ఉప ఎన్నికలు కూడా మే 13న నిర్వహించునున్నట్లు తెలిపారు.