ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు రాష్ట్రంలో ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పనులను ఏపీ ప్రభుత్వం సంతృప్తికరమైన రీతిలో నిర్వహిస్తోందని కౌన్సిల్ సభ్యులు ప్రభుత్వాన్ని అభినందించారు. రాష్ట్ర పర్యటనలో ప్రస్తుతం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం కింద మామిడి చెట్లు చుట్టూ పొదులు తవ్వకం పనులు, ఫామ్ ఫాండ్స్ ,మామిడి తోటల పెంపకం, వైయస్సార్ జలకళ , చెరువుల్లో పూడిక తీయుట, చెరువుల్లోకి నీరు వచ్చేలా కాలవ ఏర్పాట్లు, రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటడం, నీరు నిలవుంచేందుకు గుంతలు, వైయస్సార్ జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణ పనులు ఇలా పలు రకాల పనుల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాదిలో మూడు రోజుల ఉపాధి కల్పిస్తూ వారికి చేదోడుగా ఉంటుంది. 100 రోజులు ఉపాధి పనికెళ్ళితే 30 వేల నుంచి 40 వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అడిగిన ఉపాధి కూలీలందరికీ జాబ్ కార్డు లో మంజూరు చేస్తున్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి పనులు చేయుటకు అర్హులని ప్రాజెక్ట్ డైరెక్టర్ జె.సునీత మీడియాతో తెలిపారు.