పరిశుభ్రత విషయంలో ఒకప్పటి ఆంధ్ర ప్రదేశ్ కి ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ కి చాలా తేడా ఉంది. పరిస్థితి ఎంతో మెరుగయింది. అందుకు రుజువే ఇటీవల ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు.
స్వచ్చ సర్వేక్ష్ణ్ జాతీయ స్థాయి అవార్డులలో ఆంధ్ర ప్రదేశ్ నగరాల్ పలు అవార్డులను కైవసం చేసుకుంది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పారిశుధ్య సర్వే లో,ఆంధ్ర నగరాలు విజయవాడ, గుంటూరు,గ్రేటర్ విశాఖ, తిరుపతి 2023 సంవత్సరానికి జాతీయ స్థాయి లో అవార్డులు సాధించాయి.
ముఖ్యమంత్రి జగన్ సొంత అస్సెంబ్లీ నియోజక వర్గం పులివెందుల పట్టణం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు గెల్చుకోవడం విశేషం.
రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పరిశుభ్రత, పారిశుధ్యం, పచ్చదనం పరిస్థితులు గతం కంటే ఎంతో మెరుగయ్యాయని ఈ అవార్డుల పంట రుజువు చేస్తోంది.
విజయవాడ గత మూడేళ్ళుగా వరుసగా cleanest city, cleanest state capital అవార్డులను సాధిస్తూ వస్తోందని,విశాఖ గత మూడేళ్ళుగా వరుసగా “best citizen feed back city,clean big city” జాతీయ అవార్డులను సాధించిందని,స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఎం డీ గంధం చంద్రుడు తెలిపారు.
తిరుపతి నగరం 20221 లో best small citizen feed back city ,2022 లో సఫాయి మిత్ర సురక్షిత్ ప్రెసిడెంట్ అవార్డు,దక్కించుకుందని చంద్రుడు తెలిపారు. పుంగనూరు పురపాలక సంఘం 2021,2022 లలో వరుసగా best citizen feed back city అవార్డులను, పులివెందుల 2022 సంవత్సరానికి innovation, best practice అవార్డుని, 2023 లో జాతీయ అవార్డును గెల్చుకుంది.
దేశంలోని వందలాది నగరాలు పట్టణాలను వెనక్కి నెట్టి ఆంధ్ర ప్రదేశ్ ఈ అవార్డులను గెల్చుకోవడం గమనార్హం.
ఈ అవార్డులు గెల్చుకోవాలంటే పరిశుభ్రత విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించవలసి ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ నగరాలు పట్టణాలు ఈ ప్రమాణాలు పాటించి, ఈ అవార్డులను సాధించాయి.